భూములుపై సంపూర్ణ హక్కులు రైతులకు ఉండేలా చేసిన చట్టమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. చట్టంపై చంద్రబాబు ప్రజల్లో గందరగోళాన్ని తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పలమనేరు, నెల్లూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తిరిగి వైసిపిని గెలిపించాలని కోరారు.గత 59 నెలల పాలనలో రూ.2.70లక్షల కోట్లును డిబిటి ద్వారా అందించామన్నారు.14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పథకం గుర్తు వస్తుందా? చంద్రబాబు ఎప్పుడైనా పేదల ఖాతాల్లోకి ఒక్క రూపాయి వేశారా? అని ప్రశ్నించారు. చంద్రబాబాబు ఒట్టి మోసకారనీ…మాటలు నమ్మొద్దని విజ్ఞప్తిచేశారు. తాను ఏకంగా 130 సార్లు బటన్ నోక్కి రూ. 2.70 లక్షల కోట్లు నేరుగా లంచాలు, వివక్షా లేకుండా అందించానన్నారు. వైసిపికి రెండు బటన్లు నొక్కి ఓటేస్తేనే.. పథకాల కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు. మన బతుకులు బాగుపడాలన్నా. పేదల భవిష్యత్తు మారాలన్నా. లంచాలు లేని అవినీతి రహిత పాలన కొనసాగాలన్నా.. ఫ్యాన్ బటన్ పై రెండు బటన్లు నొక్కాలని వైఎస్ జగన్మోహనరెడ్డి కోరారు.