fbpx

వైసీపీలో కార్యకర్తలకు విలువ లేదు

Share the content

కాకినాడ జిల్లా జగ్గంపేటలో వైసిపి కి బిగ్ షాక్ తగిలింది.నియోజకవర్గ ఇన్చార్జిల విషయం గోదావరి జిల్లాలలో ప్రకంపనలు రేపుతుంది. తమ నాయకులకు టిక్కెట్ ఇస్తేనే పార్టీకి పని చేస్తామని కార్యకర్తలు అధిష్టానానికి హెచ్చరికలు పంపిస్తున్నారు.అందులో భాగంగానే వ్యవసాయ కమిటీ చైర్మన్ జనపరెడ్డి సుబ్బారావు, కిర్లంపూడి ఎంపిపి,గండేపల్లి జెడ్పీటీసీలు,గండేపల్లి మండల పార్టీ అధ్యక్షులు కందుల చిట్టీ బాబు వైసిపి పార్టీకి రాజీనామా చేశారు.కార్యకర్తలకు ఉన్న సమస్యలను జిల్లాలో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉందని వారు తెలిపారు.చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో మూడేళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే చంటిబాబు కాకుండా తోట నరసింహం కు ఇవ్వడం పై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పార్టీ విధి,విధానాలు నచ్చకే పార్టీని విడుతున్నమని జనప రెడ్డి సుబ్బారావు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *