కైకలూరులో పోటీ ఇప్పుడు రసవత్తరంగా మారుతుంది. పూర్తిగా కొల్లేరు ప్రాంతం అయిన కైకలూరులో మత్స్యకారులు అధికం. వడ్డీ సామాజిక వర్గం నేపథ్యం ఇక్కడ ఎక్కువ . గత ఎన్నికల్లో వైసీపీ తరఫున దూలం నాగేశ్వరరావు గెలిస్తే.. వచ్చే ఎన్నికల్లో దూలం నాగేశ్వరరావుకు ప్రత్యర్థి ఎవరు అనేది ఇప్పటివరకు తేలలేదు. కైకలూరు స్థానిక టిడిపి నియోజకవర్గ ఇన్చార్జిగా పని చేసిన జయ మంగళ వెంకటరమణ అకస్మాత్తుగా వైసీపీ లోకి వెళ్లడం ఆయనకు అక్కడ ఎమ్మెల్సీ పదవీ లభించడంతో.. ఇప్పుడు కైకలూరు నియోజకవర్గం లో టిడిపిని నడిపించే వారే లేకపోయారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారు అన్నది సస్పెన్స్ గా మారింది. వారాహి విజయ యాత్రలో భాగంగా ఇటీవల పవన్ కళ్యాణ్ కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి లో పర్యటించి బహిరంగ సభ నిర్వహించారు. ఒత్తులో భాగంగా కైకలూరు నియోజకవర్గాన్ని జనసేన అక్కడి నుంచి పోటీ చేసే బలమైన అభ్యర్థి ఆ పార్టీకి లేరు. దీంతో దూరం నాగేశ్వరరావును బలంగా ఢీకొట్టగల అభ్యర్థి కోసం ఇప్పటికే నియోజకవర్గంలో జల్లెడ పట్టడం మొదలైంది.
** ప్రస్తుతం బిజెపిలో కొనసాగుతున్న మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ త్వరలోనే పార్టీ మారతారని కైకలూరు నియోజకవర్గం అభ్యర్థిగా ఆయనే ఉంటారు అన్న ప్రచారం ఊపందుతుంది. కైకలూరు నియోజకవర్గం సీటును జనసేనకు ఇస్తే కనుక ఆయన జనసేన పార్టీలో చేరుతారని అలా కాకుండా టిడిపి ఈ స్థానాన్ని తీసుకుంటే టిడిపిలోకి వచ్చే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ఇటీవల వారాహి విద్య యాత్రలో కూడా కామినేని శ్రీనివాస్ ఫోటోలతో జనసేన నాయకులు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టారు. పొత్తులో భాగంగా కామినేని శ్రీనివాస్ కైకలూరు నుంచి పోటీ చేస్తే దూలం నాగేశ్వరరావుకు అన్ని విధాలుగా గట్టి అభ్యర్థి అవుతారని లెక్కలు చెబుతున్నాయి. 2014లో పొత్తులో భాగంగా బిజెపికి ఈ సీటు వెళితే, కామినేని శ్రీనివాస్ ఇక్కడి నుంచి గెలిచి మంత్రి అయ్యారు. చంద్రబాబు క్యాబినెట్లో కీలకమైన వైద్య ఆరోగ్యశాఖను నిర్వర్తించారు. ఇటువైపు చంద్రబాబుతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన కామినేని శ్రీనివాస్ కు మెగా కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో కామినేని అప్పటి పరిస్థితిని బట్టి ఏ పార్టీలో చేరతారు అన్నది నిర్ణయించుకుంటారని తెలుస్తోంది. ఒకవేళ బిజెపి కూడా ఈ కూటమితో కలిసి వస్తే కైకలూరు సీటును వాడి
కామినేని మళ్లీ బిజెపి నుంచి పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు కామినేని శ్రీనివాస్ మరి కొద్ది రోజుల్లోనే పార్టీ మారి ఎక్కడి నుంచి మళ్లీ అసెంబ్లీకి వెళ్లేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికి గ్రౌండ్ లెవెల్ లో దీనికి సంబంధించి రంగం సిద్ధమైనట్లు సమాచారం.