fbpx

వైనాట్ ఆంధ్రప్రదేశ్ .. అధికారంలోకి కాంగ్రెస్

Share the content

మొన్న కర్ణాటక, నిన్న తెలంగాణలో వరుస విజయాలతో దక్షిణాదిన కాంగ్రెస్ జోరు పెంచింది. అదే ఉత్సాహంతో “వై నాట్ ఆంధ్రప్రదేశ్” అంటూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే అధికారమని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ధీమా వ్యక్తం చేశారు. పబ్లిక్ మేనిఫేస్టోతో ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు రంగం సిద్ధం చేస్తున్నారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో ఏఐసీసీ పెద్దలు,నేతలతో మూడు రోజులు వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. మొదటి రోజు బుధవారం పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు నేత్రుత్వంలో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ, కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యచరణపై సుధీర్ఘంగా వారు చర్చించారు. వారం రోజుల క్రితం హఠాత్తుగా మరణించిన జనరల్ సెక్రెటరీ జక్కా శ్రీనివాస్ కి ముందుగా నివాళులు అర్పించారు.అనంతరం ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికలను ద్రుష్టిలో ఉంచుకునే పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలకు ఇదే స్ట్రాటజీ మీటింగ్ అని, రాజకీయంగా ఏవిధంగా ఎన్నికలకు వెళ్లాలో ఈ సమావేశాల్లోనే నిర్ణయిస్తామని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు తెలిపారు.

  • పొత్తులపై ఏఐసిసిదే తుది నిర్ణయం
    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలతోనే తాము ప్రజల్లోకి వెళ్తామని అదే తమ ప్రధాన అజెండా అని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. త్వరలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో రాష్ట్రం నుంచి ప్రధాన నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, పోలవరం, వెనకబడిన ప్రాంతాలకు నిధుల వంటివి తమ ప్రధాన ఎజెండాలో భాగమన్నారు. ప్రస్తుత మూడు రోజుల సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను జిల్లా, నగర స్థాయి కాంగ్రెస్ అధ్యక్షులు నేతలకు పంపుతామని పేర్కొన్నారు. అదే విధంగా ఎన్నికల్లో పొత్తులు, ఇతర అంశాలకు సంబంధించి ఏఐసీసీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు.
  • “ప్రచారానికి కాంగ్రెస్ అతిరథ మహారథులు”
    స్థానిక సమస్యలు ప్రధాన అంశంగా స్థానిక మేనిఫేస్టోతో ప్రజల్లోకి వెళ్తామని ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. ప్రతి జిల్లా స్థాయిలో ఆ జిల్లాకు సంబంధించిన ప్రధాన సమస్యలను పరిష్కరించే దిశగా జిల్లా మేనిఫేస్టోలను రూపొందిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల ప్రచారానికి సంబంధించి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యతో పాటు ఇతర ఏఐసీసీ నేతలు కీలక పాత్ర పోషిస్తారని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు వెళ‌్లడించారు. వై నాట్ ఆంధ్రప్రదేశ్ అన్న పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు… మార్పు కావాలి అంటే కాంగ్రెస్ రావాలి అంటూ… రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించి, ఘన విజయం సాధిస్తుందని తెలిపారు.
  • రాహుల్ గాంధీ స్పూర్తితో చేరికలు
    రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర స్పూర్తితో విజయవాడకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ బాబు మెండెం కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఆయనతో పాటు రాకేష్, అజయ్, సాగర్, రవితో పాటు 15 మందికి పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసి సభ్యులు రఘువీరా రెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు పల్లం రాజు కొప్పుల రాజు, జేడీ శీలం పలువురు నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *