విశాఖ స్టీల్ప్లాంట్ యాజమాన్యం జిందాల్ స్టీల్తో చేసిన ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.ఈ మేరకు ఆదివారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ఒక ప్రకటనను విడుదల చేశారు. విశాఖ స్టీల్ ప్లాంటులోని ఆధునికమైన బ్లాస్టర్నెస్ 3ను కేంద్ర ప్రభుత్వం 23 నెలలక్రితం కావాలని మూసివేసిందని పేర్కొన్నారు. ముడిసరుకు కొనడానికి నిధులు లేవనే నెపంతో ఉత్పత్తిని తగ్గించి ప్లాంట్ ను నష్టాల్లోకి నెట్టిందని విమర్శించారు. ఇప్పుడు 3వ ఫర్నేస్ను నడిపేందుకు సెయిల్ను కాదని ఆసక్తి వ్యక్తికరణ (ఇ.ఓ.ఐ) పేరుతో జిందాల్కు అప్పగించిందని పేర్కొన్నారు. దొడ్డిదారిన ప్రయివేటుపరం చేయడానికి కేంద్రం వ్యూహాత్మకంగా ఇలా వ్యవహరిస్తోందని వెల్లడించారు. విశాఖ ఉక్కును కక్షపూరితంగా అమ్మినా, మూసినా రాష్ట్ర ప్రజానీకం అంగీకరించదని తెలిపారు. ఉక్కు కార్మికులు చేస్తున్న ఆందోళనకు సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సంఫీుభావం ప్రకటిస్తున్నదని పేర్కొన్నారు.స్టీల్ ప్లాంట్ జిందాల్ కంపెనీతో ఒప్పందం చేయడమంటే ప్రయివేటు కంపెనీలను ఏదోవిధంగా స్టీల్ప్లాంట్లోకి చొప్పించాలని ప్రయత్నించడమేనని తెలిపారు.
గతంలో పోస్కో కంపెనీతో ఒప్పందం చేయాలని ప్రయత్నించి, నూరుశాతం అమ్మాలని నిర్ణయించి పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. నేడు స్టీల్ప్లాంట్ను ముక్కలు చేసి అమ్మే విధంగా జిందాల్ ప్రయివేటు కంపెనీతో నేడు స్టీల్ప్లాంట్ ఒప్పందం చేసిందని తెలిపారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) కేంద్రప్రభుత్వ రంగ స్టీల్ పరిశ్రమ. భిలాయ్, బొకారో, దుర్గాపూర్ పరిశ్రమలు ఇందులో ఉన్నాయి. సెయిల్తో ఒప్పందం చేయడం ద్వారా సెయిల్ కంపెనీకి దక్షిణ భారతదేశంలో స్టీల్ అమ్ముకోడానికి మార్కెట్ సౌకర్యం పెరుగుతుంది. విశాఖ స్టీల్ప్లాంటు నడపడానికి కావాల్సిన ముడిసరుకు స్టీల్ అథారిటీ సెయిల్ విశాఖ స్టీల్ప్లాంటుకు పంపగలిగిన శక్తి ఉందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్, సెయిల్ కంపెనీలు రెండు ఒప్పందం జరగడం ద్వారా ఇద్దరికీ లాభం ఉంటుందని, రెండూ కేంద్ర ప్రభుత్వ సంస్థలు అయినందున దేశానికి ప్రయోజనకరంగా ఉంటుందని గుర్తు చేశారు. ప్రయివేటు కంపెనీని చేర్చడం ద్వారా ఉన్న ఉద్యోగాలు తొలగిస్తారని, రిజర్వేషన్లు ఉండవని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేటు కంపెనీలు తమ లాభాలకోసం ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా నాశనం చేసేటటువంటి తప్పుడు చర్యని ధ్వజమెత్తారు.