fbpx

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యకు పైడా ఆత్మీయ విందు

Share the content

మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడును బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పైడా కృష్ణమోహన్ ఆత్మీయ విందుకు ఆహ్వానించారు. శనివారం కాకినాడలోని దంటు కళాక్షేత్రంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమానికి వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అక్కడ ప్రసంగించిన అనంతరం వెంకయ్య పైడా ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా వెంకయ్యకు పైడా ఆత్మీయ విందు అందించారు. కొంతసేపు వారు మాట్లాడుకుని పైడా కుటుంబ సభ్యులను పరిచయం చేసుకున్నారు. అనంతరం వెంకయ్యను మర్యాదపూర్వకంగా ఆయన వెంట వెళ్లి కృష్ణమోహన్ వీడ్కోలు పలికారు. తాము బీజేపీలో గత 36 నుంచి సుపరిచితులమని అందువల్ల వెంకయ్యను మర్యాదపూర్వకంగా ఇంటికి ఆహ్వానించినట్లు పైడా చెప్పారు.
వెంకయ్యను మర్యాదపూర్వకంగా కలిసిన వారిలో బీజేపీ నేతలు పైడా భావన ప్రసాద్, గట్టి సత్యనారాయణ, దువ్వూరి సుబ్రహ్మణ్యం పితాని లీల, రంబాల వెంకటేశ్వరరావు, కవికొండల భీమ శేఖర్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *