ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం సీటు కేటాయింపు విషయంలో గందరగోళం నెలకొంటుంది. ఉంగుటూరు నియోజకవర్గం సీటు మీద టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు గంపెడు ఆశలు పెట్టుకుంటే, అక్కడ నుంచి పొత్తులో భాగంగా జనసేన పార్టీ నుంచి ధర్మరాజు సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఉంగుటూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ సీటు తనకు కన్ఫామ్ అయిందని ధర్మరాజు అనుచరులు హడావిడి చేయడం కనిపించింది. దీంతో మహానాడుకు నియోజకవర్గం నుంచి టీడీపీ కీలక నేతలు కూడా హాజరు కాలేదు.
గన్నిని కాదు అంటారా?
నియోజకవర్గం నుంచి 2014లో టిడిపి అభ్యర్థిగా గెలిచిన ఏలూరు జిల్లా టిడిపి అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు ఈ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో పుప్పాల వాసు బాబు చేతిలో ఓడిపోతే 2014లో వాసు బాబును గెలిచి అసెంబ్లీలో గన్ని అడుగు పెట్టారు. 2009 లోనూ గన్ని వీరాంజనేయులు చివరి నిమిషంలో పోటీకి కుదరకపోవడంతో ఆమె భార్య లక్ష్మీని రంగంలో దింపారు. వట్టి వసంత కుమార్ వంటి నేతను బలంగా ఎదుర్కొన్నారు. తర్వాత కూడా టిడిపిలో కొనసాగుతూ క్రియాశీలకంగా వ్యవహరించారు. జిల్లాలో సీనియర్ నేతగా పేరు ఉన్న వీరాంజనేయులు కు టికెట్ చంద్రబాబు కాదంటారా లేక వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా అన్న సందీగ్దత ఇప్పుడు అంతటా ఉంది. కచ్చితంగా ఏలూరు జిల్లా నుంచి ఈ సీటును జనసేన పార్టీ ఆశిస్తుంది. బలమైన నాయకుడు ఉండడంతో కచ్చితంగా ఈ సీటు అడిగే అవకాశాలు లేకపోలేదు. దీంతో ముందుగానే ఇక్కడ బలం పుంజుకునే దశగా జనసేన పార్టీ పనిచేస్తుంది.
సైలెంట్ కి కారణం ఏమిటీ?
ఏలూరు జిల్లా టిడిపి అధ్యక్షుడు ఉంగుటూరు నియోజకవర్గం ఇంచార్జ్ వీరాంజనేయులు గత కొంతకాలంగా సైలెంట్ గా ఉండిపోయారు. అధిష్టానం నుంచి కీలకమైన సంకేతాలు రావడంతోనే ఆయన ప్రస్తుతం సైలెంట్ గా ఉండిపోయారు అని తెలుస్తోంది. కచ్చితంగా ఈ సీటును గని వీరాంజనేయులు త్యాగం చేయాల్సి వచ్చే అవకాశం రావడంతో ఆయన మరోచోట సర్దుబాటు చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే ఆయన పలు నియోజకవర్గాల గురించి ఆరా తీస్తున్నారు. పక్కనే ఉన్న గోపాలపురం సైతం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావడంతో గణికి ఎక్కడ సీటు సర్దుబాటు చేస్తారు అనేది ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. మరొపక్క ఈ సీట్ పై పూర్తి జనసేన పార్టీ నేతలు కనిపిస్తున్నారు.