fbpx

చంద్రబాబు బయటకు రాకుండా ప్లాన్

Share the content

చంద్రబాబు పై జగన్ ప్రభుత్వం పాత కేసులను తిరగ తోడుతోంది. ఒక్కదాని తర్వాత మరొక కేసు పెట్టేలా వ్యూహం రచించింది. ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కేసు అనంతరం అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు తెరపైకి తీసుకువచ్చే ప్రణాళికను జగన్ ప్రభుత్వం వేస్తున్నట్లు కనిపిస్తోంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో భారీగా అవినీతి జరిగింది అని 2022లోని కేసు నమోదు చేసిన వైసీపీ ప్రభుత్వం దాన్ని అప్పట్లో పక్కన పెట్టింది. అయితే ఇప్పుడు తాజాగా పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా పాతదే. దీంతో పాత కేసులన్నీ కూడా మరోసారి చంద్రబాబును నెత్తి మీద పడే అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబు పాలనలో విపరీతమైన అవినీతి జరిగింది అని, పలు కేసులు పెట్టి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వచ్చే ఎన్నికల్లో దీన్ని కచ్చితంగా వాడుకోవాలి అని జగన్ భావిస్తున్నారు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విపరీతమైన అవినీతి జరిగింది అని వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు చంద్రబాబు మీద పెట్టిన కేసులను వాడుకోనున్నారు. మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం వస్తే అవినీతి మరింత ఎక్కువ అవుతుందని జగన్ ప్రభుత్వం ప్రత్యక్షంగా ప్రజలకు డబ్బులు వేస్తోంది సంక్షేమం అందిస్తుంది అనే కాన్సెప్ట్ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైసీపీ సోషల్ మీడియా కూడా ఇప్పటికే సూచనలు అందాయి. దీంతో చంద్రబాబు అరెస్టుతో పాటు లోకేష్ ను సైతం త్వరలో అవినీతి కేసుల్లో ఇరికించే అవకాశం కనిపిస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హాయంలో విపరీతమైన అవినీతికి తండ్రి కొడుకులు ప్రధాన కారకులు అని చెప్పడంతోపాటు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని నాయకులు లేకుండా ఎన్నికల్లో ఎదుర్కొనే పార్టీగా చేయాలి అని వైసీపీ ప్లాన్ వేస్తోంది. దీంతో త్వరలోనే చంద్రబాబుపై మరిన్ని కేసులు మోపే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *