కాకినాడ రూరల్ నియోజకవర్గం టిడిపి కోఆర్డినేటర్ గా పిల్లి సత్యనారాయణమూర్తిని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు నియమించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈయన సతీమణి పిల్లి అనంతలక్ష్మి కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు డైరెక్టర్ గా పనిచేశారు. ఇటీవల కాకినాడ రూరల్ నుంచి టిడిపి సీటు ఆశించగా పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించగా పార్టీ కేడర్ అంతా అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటివరకు కాకినాడ రూరల్ కు ఇన్చార్జి లేకపోవడంతో తక్షణం ఉత్తర్వులు జారీ చేశారు. పిల్లి సత్యనారాయణ మూర్తితో పాటు కటకంశెట్టి ప్రభాకర్ (బాబి)ని కూడా కోఆర్డినేటర్ గా ప్రకటించారు. ఈ సందర్భంగా పిల్లి అనంతలక్ష్మీ సత్యనారాయణమూర్తి దంపతులను కాకినాడ రూరల్ టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ, మాజీ ఎంపీపీ గుల్లిపల్లి శ్రీనివాసరావు, నాయకులు కోటగిరి మహేంద్ర బాబు, పంపన కన్నారావు, పులపకూర శుభ మహేష్, చీపురుపల్లి జయేంద్రబాబు, యాసలపు విష్ణు, మద్దూరి స్వామి, దేవు జమిందార్, గొల్లపల్లి బుజ్జి, చాట్రా ఇమ్మానుయేలు, బొజ్జా భవాని సాంబశివరావు, యాసలపు కన్నబాబు, మేడిశెట్టి ఏసు, ఎలగా లోవరాజు, యాళ్ల రాజా, నులుకుర్తి వీరన్న, పేపకాయల సత్తిబాబు, కాళ్ల శ్రీను, పెంకే వీరబాబు, దొమ్మేటి వెంకటరమణ, పెమ్మాడి శ్రీను, చల్మాజీ, కొల్లుబోయిన అచ్యుత్, సరిదే నాగా హరినాథ్, బాలకృష్ణ మోహన్, గుబ్బల ప్రసాద్ రావు, పిల్లి విజయ్ గోపాల్, వాసంశెట్టి అంజిబాబు తదితరులు అభినందించారు.