fbpx

సీటు కేటాయించలేదన్న భావోద్వేగంతో జరిగిన పొరపాటు

Share the content

తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ సీటును జనసేన పార్టీ కు కేటాయించలేదన్న భావోద్వేగంతో రెండు రోజుల క్రితం ఆలమూరు కార్యాలయం వద్ద ప్లెక్సీలు ధ్వంసం చేశామని జనసేన నాయకులు చల్లా బాబీ, గుత్తుల నాగేశ్వరరావు తెలిపారు. తమకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అంటే అమితమైన అభిమానమన్నారు. ఆలమూరు జనసేన పార్టీ కార్యాలయం లో మంగళవారం న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ…రెండు రోజుల క్రితం పార్టీ కార్యాలయం వద్ద జరిగిన సంఘటన దురదృష్టకరమని.. ఈ సంఘటనతో ఎవరి ప్రమేయం లేదని కేవలం తాము భావోద్వేగానికిలోనై ప్లెక్సీలను ధ్వంసం చేశామని తెలిపారు. తాము చేసిన తప్పును సరిదిద్దుకోవడంలో భాగంగా పవన్ కళ్యాణ్ కు క్షీరాభిషేకం చేశామన్నారు.పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు, నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ల సూచన మేరకు వారి అడుగుజాడల్లో తమ నడవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు మండల జనసేన పార్టీ నాయకులు సంగీత సుభాష్, తాళ్ల డేవిడ్, తోట వెంకటేశ్వర్లు, గంటా స్వయంప్రకాష్, మాకినీడి బాబీ, యేపూరి గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *