fbpx

ఎలక్ట్రోరల్ బాండ్లు రాజ్యంగ విరుద్ధం : సుప్రీం కోర్టు

Share the content

రాజకీయ పార్టీలకు విరాళాలు అందించేందుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం 2018 లో తీసుకువచ్చిన ఎలక్టోరల్ బాండ్లు విధానం పై సుప్రీం రాజ్యంగ ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. ఐదుగురు సభ్యుల రాజ్యంగ ధర్మాసనం బాండ్ల విధానాన్ని ఏకగ్రీవంగా రాజ్యంగ విరుద్ధంగా ఉందని స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వటం క్విడ్ ప్రో కు దారి తీరుస్తుంది అని స్పష్టం చేసింది.నల్ల ధనాన్ని అరికట్టడానికి చాలా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని పేర్కొన్నది. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించింది.ప్రాథమిక హక్కులు లోని 19 (1- ఏ) , సమాచార హక్కు చట్టానికి సైతం విఘాతం కలిగిస్తున్నాయని పేర్కొన్నది. పార్టీలకు ఇచ్చే విరాళాలు దాతలను గోప్యంగా ఉంచడం చట్ట విరుద్ధం అని స్పష్టం. జేసింది.తక్షణమే బండ్ల జారిని నిలిపివేయాలని పేర్కొంది.కాగా ఇప్పటివరకు రాజకీయ విరాళాలు ఎక్కువ అందే పార్టీల జాబితాలో అధికార బిజెపి పార్టీ మొదటి స్థానంలో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *