అన్నమయ్య జిల్లా కే.వి పల్లి మండలంలో కానిస్టేబుల్ గణేష్ ను ఎర్ర చందనం తరలిస్తున్న వాహనంతో ఢీకొట్టి హత్యా చేసిన దుర్మార్గపు ఘటన వెనుక ఎవరు ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించాలని జనసేన పిఏసి కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.అరెస్ట్ చేసి దోషులను కటినంగా శిక్షించాలి అని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శేషాచలం అడువుల్లో విలువైన ఎర్ర చందనాన్ని అక్రమంగా తరలించు స్తున్న ముఠాలను అధికార వైసిపి పెంచి పోషిస్తుంది అని విమర్శించారు. పాలకపక్షం అండతోనే స్మగ్లర్లు పెట్రేగిపోతున్నారని పేర్కొన్నారు. స్మగ్లర్లు ఇంతటి దురాగతానికి పాల్పడ్డా ఆ ముఠా వెనుక ఎవరూ ఉన్నారో పోలీసులు వెల్లడించకుండా గోప్యత పాటించడం పలు సందేహాలకు తావిస్తోంది. అటవీ శాఖ స్వాధీనంలో ఉన్న ఎర్ర చందనాన్ని అంతర్జాతీయ మార్కెట్ లో సక్రమంగా విక్రయించుకో లేకపోతుందని అని పేర్కొన్నారు.వైసిపి ప్రభుత్వం, స్మగ్లర్లు మాత్రం ఎర్రచందనం ను యధేచ్చగా రాష్ట్రం సరిహద్దులు దాటించేస్తున్నారు అని ఎద్దేవా చేశారు.అరుదైన ఎర్ర చందనాన్ని కాపాడాల్సిన బాధ్యతను వైసిపి ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.