fbpx

ఘనంగా షష్టి మహోత్సవ వేడుకలు

Share the content

కాకినాడ జిల్లా కరపలో శ్రీశ్రీశ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల షష్టి మహోత్సవ వేడుకలను సోమవారం అత్యంత వైభవంగా జరిగాయి.తెల్లవారు జాము నుంచే హోమాలు, పూజలు నిర్వహించేందుకు భక్తులు బారులు తీరారు. జనసేన నాయకుడు చిక్కాల వివి సత్యనారాయణ (దొరబాబు) ఆధ్వర్యంలో 51 అడుగుల సుబ్రమణ్యేశ్వర విగ్రహానికి విశేష పూజలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాకినాడ శ్రీ పీఠమునకు చెందిన పరిపూర్ణానంద సరస్వతి హాజరై భక్తులకు హితోపదేశం చేశారు. సుబ్రమణ్యస్వామిని కొలిచిన వారికి అన్ని కార్యక్రమాలు విజయవంతం అవుతాయంటూ ఉద్భోద చేశారు. అక్కడకు హాజరైన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దొరబాబుతో పాటు చిక్కాల సుబ్బారావుల ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.
జనసేన నాయకులు పంతం నానాజీ, డేగల సతీష్, కరెడ్ల గోవిందరాజు, కడలి ఈశ్వరి, టీడీపీ నేతలు వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు), గ్రంధి బాబ్జి, నున్న దొరబాబులతోపాటు ఉంగరాల బూరిబాబు, బొండా సూర్యారావు పలువురు హాజరై వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్లకు పూజలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *