fbpx

నెల రోజుల్లో సామాజిక భవనం పూర్తి.

Share the content

రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీలో అసంపూర్తిగా ఉన్న సామాజిక భవనాన్ని నెల రోజుల్లో పూర్తి చేస్తామని కాకినాడ రూరల్ నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ పేర్కొన్నారు. అసంపూర్తిగా ఉన్న సామాజిక భవనాన్ని పునర్మించేందుకు శుక్రవారం ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఈ భవనానికి శంకుస్థాపన చేశానని, అనివార్య కారణాల వలన భవనం పూర్తి కాలేదని అన్నారు. నెల రోజులలో భవనాన్ని అందంగా, సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలిపారు. అనంతరం అడబాల ట్రస్ట్ కార్యాలయం సందర్శించి నిత్య అన్నదాన పథకంలో భాగంగా వృద్ధులకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అడబాల రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో కురసాల సత్యనారాయణ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు నురుకుర్తి రామకృష్ణ, గగారిన్, కృష్ణంరాజు, రాజా ,కడియాల చిన్న, సత్తి చిన్నారి , ఇంజనీరింగ్ సిబ్బంది వాసు, బలరాం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *