దేశంలో బీజేపీని… రాష్ట్రంలో ఆ పార్టీకి మద్దతు తెలిపే పార్టీలను ఓడించడమే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్) లక్ష్యమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోహన్ లాల్ పాటిల్ తెలిపారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్ )ఉత్తరాంధ్ర జిల్లాల కార్యకర్తల రాజకీయ సదస్సు ఆదివారం విశాఖపట్నం అంబేద్కర్ భవన్ లో పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బొడ్డు కళ్యాణ్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మోహన్ లాల్ పాటిల్ మాట్లాడుతూ..రాబోయే ఎన్నికల్లో బీజీపీ ని ఓడించే లక్ష్యం కోసం కలిసొచ్చే పార్టీలతో జతకట్టడానికి తాము సిద్ధం అని తెలిపారు.. రాష్ట్రంలో అన్ని పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ గోజపాల్, జాతీయ కార్యదర్శి పిట్టా వరప్రసాద్, జాతీయ కోశాధికారి కుర్రవర్లాల్ రామ్ టెక్, దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులుపి అంజయ్య,పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేక వెంకటేశ్వరరావు,రాష్ట్ర కోశాధికారి నక్క సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గంజి పూర్ణిమ, మహిళా కార్యదర్శి రాజాన సరస్వతి, పార్టీరాష్ట్ర నాయకులు కే.గణపతి. పార్టీ జిల్లా అధ్యక్షులు గౌతమ్ బాబు ప్రసంగిస్తూ… పార్టీ విధివిధానాలు వివరించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు అభిమానులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.