పవన్ కళ్యాణ్ ప్రసంగాలను జనసేన తెలుగుదేశం పార్టీ శ్రేణులు కంటే వైసీపీ శ్రేణులే ఎక్కువగా గమనిస్తున్నట్లు కనిపిస్తోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతి మాటను వైసీపీ శ్రేణులు చాలా శ్రద్ధగా ఆలకిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నోటి నుంచి వచ్చే మాటలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాప్తి చేయడంలో జనసైనికులు కంటే ఎక్కువగా వైసిపి సోషల్ మీడియా విభాగం అలాగే వైసిపి కార్యకర్తలు ముందు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇవ్వాలని ఆకాంక్షతో సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా వైసీపీ శ్రేణులు ఆయన ప్రసంగాలను శ్రద్ధగా వింటున్నట్లు స్పష్టంగా అర్థం అవుతుంది.
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అరెస్టు చేయడం మరికొద్ది రోజుల్లో లోకేషన్ కూడా అరెస్టు చేస్తారు అని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో వైసిపి ప్రధాన శత్రువుగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రమే కనిపించేలా ఉంది. వచ్చే ఎన్నికలకు వైసిపి నేరుగా పవన్ కళ్యాణ్ ను ఎదుర్కొనే వ్యూహంలో భాగంగానే ఆయన ప్రతి మాటను వింటూ దానికి కౌంటర్లను వెతికే పనిలో సోషల్ మీడియా చురుగ్గా పనిచేస్తుంది. వైసీపీ సోషల్ మీడియా నాలుగో విడత ద్వారా మొదలైన దగ్గర నుంచి చాలా అలర్ట్ అయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. దీనిలో భాగంగానే పవన్ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాటను క్యాష్ చేసి వెంటనే దానికి కౌంటర్లు రెడీ చేయాలని వైసిపి భావిస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రసంగం మొత్తం మొదటి నుంచి చివరి వరకు అత్యధిక వ్యూస్ తో సోషల్ మీడియాలో పరుగులు పెడుతుంది.