fbpx

ముద్రగడ కుమార్తె సంచలన వ్యాఖ్యలు….పవన్ కళ్యాణ్ ను తిట్టేందుకే ముద్రగడను వాడుతున్నారంటూ విమర్శలు

Share the content

అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది.కాపు ఓట్లను పవన్ కళ్యాణ్ కు మల్లించకూడదన్న ఉద్దేశంతో …కాపు ఉద్యమ నేత ముద్రగడను వైసిపి పార్టీలోకి ఆహ్వానించారు. కానీ ఆయన ఇటీవల పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు సొంత కుటుంబ సభ్యులకే మింగుడు పడటం లేదు.తాజాగా ముద్రగడ కుమార్తె క్రాంతి ఒక వీడియోలో మాట్లాడిన మాటలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. పవన్ కళ్యాణ్ ను తిట్టెందుకే ముద్రగడ ను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాడుకుంటున్నారని విమర్శించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించటానికి వైసిపి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. పవన్ గెలిస్తే ముద్రగడ పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానన్నా మా నాన్న వ్యాఖ్యలు ఆయన అభిమానులకే నచ్చడం లేదని అన్నారు. వైసిపి పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థి వంగా గీత గెలుపు కోసం పోరాటం చేస్తే స్వాగతించవచ్చు… కానీ పవన్ కళ్యాణ్ ను, ఆయన అభిమానులను వ్యక్తిగతంగా విమర్శించడం సరికాదన్నారు.ఎన్నికల అనంతరం ముద్రగడను వైసిపి వదిలేస్తుందని జోస్యం చెప్పారు.ముద్రగడ వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని తెలిపారు.పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తాను కృషి చేస్తానని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *