fbpx

విజయనగరం ను క్యాన్సర్ గడ్డలా పీల్చేస్తున్నా బొత్స కుటుంబం : లోకేష్

Share the content

నిరుపేద కుటుంబాలను క్యాన్సర్ గడ్డ నమిలేసి కటిక నిరుపేదరికంలోకి ఎలా తోసేస్తుందో…విజయనగరం జిల్లాను బొత్సా కుటుంబం ఒక క్యాన్సర్ గడ్డలా పీడించి ఇంకా పేదరికంలోకి తోసేస్తుందనీ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మండిపడ్డారు. క్యాన్సర్ గడ్డ పోవాలంటే రేడియేషన్ ఇవ్వవలసిన అవసరం ఉంది అని వెల్లడించారు…వచ్చే ఎన్నికల్లో బటన్ నొక్కి బొత్స కుటుంబ క్యాన్సర్ గడ్డకు రేడియేషన్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. గురువారం చీపురుపల్లి లో ఏర్పాటు చేసిన శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ…ఒక సీనియర్ నాయకులుగా ముఖ్యమంత్రిని నిలదీసే సత్తా బొత్సా కు ఉంది..ఎందుకు నిలదీయడం లేదు? దానికి కారణం ఒకటే…ఆయన చేస్తున్న అవినీతి. విద్యా శాఖ మంత్రి పెన్ లో ఇంక్ బాగా ఉంది…అవినీతి కోసం వాడుతారు తప్పా…అభివృద్ధి కోసం వాడడు…గత ఐదేళ్లుగా చీపురుపల్లి కి చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు. నిరుపేద కుటుంబాలకు సంబంధించిన భూములు ఎందుకు కబ్జా చేశారని ప్రశ్నించారు…ఉత్తరాంధ్ర అభివృద్ధి గురుంచి పార్లమెంట్ లో విజయనగరం ఎంపి చంద్రశేఖర్ ఏమైనా మాట్లాడారా అని ప్రశ్నించారు.లోకేష్ నమ్ముకుంది అంబేద్కర్ రాజ్యాంగం….జగన్ నమ్ముకున్నది రాజారెడ్డి రాజ్యాంగం. తాను ప్రజల్లో తిరిగితే…జగన్ పరదాల కట్టుకొని తిరుగుతాడు…తాను స్టాన్ఫోర్డ్ లో చదివితే…జగన్ టెన్త్ పరీక్ష పేపర్ లీక్ చేసి పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన వ్యక్తి…నాకు క్లాస్ మేటేస్ ఉంటే.జగన్ కు జైల్ మేట్స్ ఉన్నారని ఎద్దేవా చేశారు.

జగన్ క్యాబినేట్ అతి చెత్త క్యాబినేట్.

జగన్ అసమర్థ లు ఐతే…మంత్రులు పనికిమాలిన వారు..పొద్దునే లేస్తే ఢిల్లీ చుట్టూ బుగ్గన అనే అప్పుల అప్పారావు తిరుగుతారు. ….ఇసుక గనులను దోచేసే పాపాల పెద్దిరెడ్డి….నకిలీ మద్యం తో పాటు కోర్ట్ లోనే దొంగతనం చేశాడు వ్యవసాయ శాఖ మంత్రి కానీ గోవర్ధన్ రెడ్డి….పిల్ల కాలువలను కూడా తవ్వలేని అరగంట అంబటి నీటి పారుదల మంత్రి…..సొంత ఊర్లో ధాన్యం కొనుగోలు చేసినప్పుడు కనీసం బ్యాగ్ లు ఇవ్వలేని ఏర్రిపప్ప మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు….పెట్టుబడి లు ఎప్పుడు తీసుకువస్తారు అంటే…కోడి ముందా? గుడ్డు ముందా అని బుర్ర కథలు చెప్పే మంత్రి కోడిగుడ్డు అమర్నాథ్ లాంటి మంత్రి వర్గం జగన్ కేబినెట్ లో ఉందని ఎద్దేవా చేశారు.పిల్లలు బాగా చదువుతున్నారు అందుకే ఉద్యోగాలు రావడం లేదని విద్యా శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సొంత అమ్మ చెల్లీ కే న్యాయం చేయలేదు
మా నమ్మకం నువ్వే జగన్ అని ఫ్లెక్సీలు కడుతున్నారు. సొంత అమ్మ చెల్లీ జగన్ ను నమ్మట్లేదు….మేము మిమ్మల్ని ఎలా నమ్మాలి? సొంత చెల్లలు షర్మిళ …సునీత రెడ్డి లకు న్యాయం చేయలేని వారు మనకి న్యాయం చేస్తారా అని ప్రశ్నించారు..జగన్ జైల్ లో ఉంటే షర్మిల పాదయాత్ర చేశారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తరువాత మెడపట్టి బయటకు గెంచారు అని పరిస్థితి వచ్చింది..వైసిపి శోషల్ మీడియా మీడియా గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు.రెండు నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది…వడ్డీతో సహా చెల్లించే బాధ్యత తీసుకుంటానని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *