fbpx

ల్యాండ్,శాండ్,మద్యం పేర్లతో దోపిడీ

Share the content

టిడ్కో గృహాల నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని రాష్ట్ర భా.జ.పా అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు.పార్వతీపురం మన్యం జిల్లా అడ్డాపుశిల వద్ద టిడ్కో గృహాలను ఆమె సోమవారం పరిశీలించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఒక్క లబ్ధిదారుడికి కూడా ఇళ్లు అందలేదంటు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆడుదాం ఆంధ్రా’ అంటూ హడావుడి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వాస్తవానికి ప్రజలతో ఆడుకుంటోందని మండిపడ్డారు. జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన నిర్వాసితులకు న్యాయం జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ల్యాండ్‌, శాండ్‌, మద్యం పేరుతో వైకాపా ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *