fbpx

కేశినేని నాని టిడిపి నుంచి చాలా తీసుకున్నారు..అందుకే లావైపోయారు : కొలికపూడి

Share the content

విజయవాడ ఎంపి కేశినేని నాని పదేళ్ళలో టిడిపి పార్టీ కోసం ఎదైనా సహాయం చేశారా? మీరు పార్టీని వాడుకున్నారు.మీరు పార్టీని అడ్డం పెట్టుకున్నారు.మీరు పార్టీ వలనే పైకి వచ్చారు..మి అసమర్థ వలన ,వ్యక్తిగత తప్పుల వలన, అహంకారం వలనే ఆర్థికం గా ఇబ్బందుల్లో ఉన్నారని టిడిపి నేత కొలికపూడి శ్రీనివాసరావు విమర్శించారు. బుధవారం ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టిడిపి పార్టీ కేశినేని నానికి చాలా ఇచ్చింది..అందుకే లావైపోయారు. ఇక నుంచి అయిన పార్టీకి కృతఘ్నత గా ఉండండి, కృతఘ్నత లేకపోతే మౌనంగా అయిన ఉండండి..అసత్యాలతో టిడిపిని విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కేశినేని నాని చేసే వ్యాపారాలు ఏమిటి? మీ వ్యాపారాలు మూతబడటనికి… టిడిపికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఒక వ్యాపారంలో లాభ నస్టాలు అనేవి తమ కృషిని, శక్తి, సామర్థ్యాలును బట్టి ఉంటాయని స్పష్టం చేశారు. వ్యాపారం చేయటం చేత కాక…నిజాయితీపరుడు ఐన ఐపిఎస్ ఆఫీసర్ బాల సుబ్రహ్మణ్యం ను బ్లాక్ మెయిల్ చేశారని తెలిపారు.చంద్రబాబు ఆదేశాలతో నాని ఆ అధికారి వద్దకు వెళ్లి క్షమాపన చెప్పారని వెల్లడించారు.

కేశినేని నాని మొదటి నుంచి అమరావతి ఉద్యమంకు వ్యతిరేఖంగా ఉన్నారు. ఒక్క గల్ల జయదేవ్ మాత్రమే అమరావతి ఉద్యమంలో ఉన్నారని తెలిపారు.. కేశినేని నాని అధికారికంగా తన సొంత నిధులను ఎంత మందికి సహాయ చేశారో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కేశినేని చిన్ని తన …సొంత డబ్బులతో వేలాది మందికి ఎంత సహాయం చేశారో మేము చెప్తాము అని తెలిపారు. మీ నియోజకవర్గ పరిధిలో ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఆరుగురు ఓటమికి మీరు కారణం కాదా అని ప్రశ్నించారు. చివరకి తమ్ముడు అయిన చిన్ని ఎదుగుదలను చూసి సహించలేక అసూయతో రగిలిపోతున్నారు అని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో విజయవాడ ఎంపి స్థానం నుంచి వైసిపి అభ్యర్థిగా కేశినేని నాని పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కవని ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *