fbpx

నిరంకుశత్వ పాలకులకు ప్రజాస్వామ్యంలో చోటు లేదు : జ్యోతుల నవీన్

Share the content

రాష్ట్రంలో ప్రశ్నించే గళం వింటే జగన్ రెడ్డికి ఒణుకు. అందుకే ఆయనకు ప్రజలు, ప్రతిపక్షపార్టీలు, మీడియా అంటే భయం. ఆ భయాన్ని కప్పిపుచ్చుకునేందుకు మీడియాపై దాడులు చేయిస్తున్నారు.రానున్న ఎన్నికల్లో ఓటమితో పాటు పరాభవం ఖాయమని తెలిసి వైసీపీ రౌడీ ముఠాతో జగన్ రెడ్డి దాడులు చేయిస్తున్నారని తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ ధ్వజమెత్తారు. బుధవారం కాకినాడ లో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… చొక్కాలు మడతపెట్టండి అంటూ జగన్ రెడ్డి సభల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ కార్యకర్తలు మీడియా ప్రతినిధులు, మీడియా సంస్థలపై దాడులకు పాల్పడుతున్నారనీ మండిపడ్డారు.జగన్ రెడ్డి ప్రతి సభల్లోను ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ -5 మీడియా పేరెత్త కుండా సభ ముగించలేదు. అంటే ఆ పత్రికలపై ఆయనకు ఎంత అక్కసు ఉందో అర్ధమౌతుందనీ పేర్కొన్నారు.ప్రతి సిద్ధం సభల్లో ను చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ల ఫోటోలు పెట్టించి కాళ్లు, చెప్పులతో తన్నించడం ఆయన సైకో తత్వానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

లాండ్, శాండ్, వైన్, మైన్, అత్యాచారాలు, హత్యలను వెలుగులోకి తెస్తున్న ఫోర్త్ ఎస్టేట్ పై దాడి చేయించడం జగన్ రెడ్డి నిరంకుశత్వ పాలనకు అద్దం పడుతుంది.నియంతలకు, నిరంకుశత్వ పాలకులకు ప్రజాస్వామ్యంలో చోటు లేదు. ఇలాంటి వారు కాలగర్భంలో కలిసిపోక తప్పదన్నారు. పత్రికలపై దాడి చేయించమని జగన్ రెడ్డి ఉసిగొల్పుతున్నారంటే రాబోయే రోజుల్లో సాక్షి పత్రిక, మీడియా విలేకర్లకు భద్రత లేకుండా చేస్తున్నట్లే అని తెలిపారు. మార్గదర్శిపై నిందలు మోపి, పోలీసులతో దాడులు చేయించి రామోజీరావును అక్రమ అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన కుటుంబసభ్యులను ఇబ్బందులకు గురి చేశారన్నారు.వాస్తవాలు ప్రజలకు చేరవేస్తున్నారన్న కక్షతో టీవీ5 కార్యాలయంపై రాళ్ల దాడి, బీఆర్. నాయుడు, సాంబశివరావు, మూర్తి లాంటి సీనియర్ జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించారనీ తెలిపారు.జగన్ రెడ్డి ఎన్ని దాడులు చేయించినా, ఎంత మంది జర్నలిస్టులను ఇబ్బందులకు గురి చేసినా ప్రశ్నించే ప్రజా గొంతుకలను ఆపలేరు అని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *