fbpx

ద్వారంపూడి నుండి కాకినాడను రక్షించుకోవాలి

Share the content

కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని వారి బారి నుండి కాకినాడను రక్షించుకోవాలని జనసేన నాయకులు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక సిద్ధార్థ నగర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో పిఎసి సభ్యుడు ముత్తా శశిధర్, నాయకులు చిక్కాల దొరబాబు, దుగ్గన బాబ్జిలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ నగరానికి కొత్తగా వచ్చి వ్యాపారం చెయ్యాలనుకొనే వారు ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలకు బెంబేలెత్తిపోతున్నారని విమర్శించారు. శుక్రవారం స్థానిక వార్పురోడ్డులో పెండెం రామకృష్ణకు చెందిన పెట్రోలు బంకుపై ద్వారంపూడి అనుచరులు దౌర్జన్యం చేసి బంకును స్వాధీనం చేసుకున్నారన్నారు. రామకృష్ణ వైసీపీని వీడి జనసేనలోకి వెళ్లడం వల్ల అతనిపై కక్ష సాధింపు చర్యలో భాగంగా ఎమ్మెల్యే అనుచరులు బంకుపై దౌర్జన్యం చేశారని శశిధర్, దొరబాబు, బాబ్జీలు తెలిపారు.


బాధితుడు,బంకు యాజమాని పెండెం రామకృష్ణ మాట్లాడుతూ తాను ఉర్లో లేని సమయంలో బంకులో పని చేస్తున్న సిబ్బందిని బెదిరించి 6లక్షల రూపాయల నగదు, 5వేల లీటర్ల పెట్రోలు, 6వేల లీటర్ల డీజిల్ ను అపహరించారని వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా ఎమ్మెల్యే ద్వారంపూడికి భయపడి పోలీసు స్టేషన్లో పిర్యాదు కూడా తీసుకోలేదని పేర్కొన్నారు. తర్వాత ఎస్పీ కార్యాలయంలో పిర్యాదు చెసామని చెప్పారు. ద్వారంపూడి కాకినాడ సిటీలో వ్యాపారాలు చేస్తున్న కాపులపై కక్ష సాధింపు చేస్తున్నారని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు తలాటం సత్య, అడబాల సత్యనారాయణ, డేగల సతీష్, ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *