fbpx

జనసేనకు బిగ్ షాక్…కాకినాడ రూరల్ లో టీడిపి రెబల్ అభ్యర్థి

Share the content

కాకినాడ రూరల్ లో జనసేన కు బిగ్ షాక్ తగిలింది. టీడిపి నుంచి టిక్కెట్ ఆశించి భంగపడ్డ పెంకే శ్రీనివాస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంనకు పెంకే శ్రీనివాస్ బాబా తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ విషయాన్ని బాబా మంగళవారం తన స్వగృహంలో విలేకరులకు తెలిపారు. బుధవారం ఉదయం పదిగంటల నుండి సర్పవరం రోడ్డులో ఉన్న శుభానికేతన్ స్కూల్ నుండి ర్యాలీగా బయలుదేరి కాకినాడ రూరల్ తహశీల్దార్ కార్యాలయంకు నందు చేరుకొని తమ నామినేషన్ దాఖలు చేస్తానని బాబా చెప్పారు. గత 15 ఏళ్ల కాలం నుంచి టీడీపీ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నా తనను అభ్యర్థిత్వం పరిగణించే అంశంలోకి తెలుగుదేశం తీసుకోకపోవడంతో తాను నిరాశకు లోనయ్యాయని పేర్కొన్నారు. తనను కాకినాడ రూరల్ నియోజకవర్గం ఓటర్ల ఆశీర్వదించాలని బాబా కోరారు. జనసేనాని పవన్ కళ్యాణ్ వలనే కాకినాడ రూరల్ సీటు బీసీల నుండి చేజారిందని బాబా ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో ములసా నాగేశ్వరరావు, ములసా బాబురావు, అడపా వీరభద్ర రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *