fbpx

కాకినాడ జిల్లాలో అసెంబ్లీకి ఐదు, పార్లమెంటుకు రెండు నామినేషన్లు

Share the content

కాకినాడ జిల్లాలో శుక్రవారం రెండో రోజు నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఐదు నామినేషన్లు, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి రెండు నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జే నివాస్ తెలిపారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ నుంచి పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) రెండు సెట్లు, కాకినాడ సిటీ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు), ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్సార్సీపీ నుంచి వరుపుల సుబ్బారావు, తుని నియోజకవర్గానికి సంబంధించి స్వతంత్ర అభ్యర్థిగా లాలం లోవరాజు, జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి జ్యోతుల వెంకట అప్పారావు (నెహ్రూ) నామినేషన్ దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ తెలిపారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి భారత చైతన్య యువజన పార్టీకి చెందిన అనుష చందక, స్వతంత్ర అభ్యర్థిగా గిడ్ల సింహాచలం ఒక్కొక్క సెట్ చొప్పున నామినేషన్లను దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ నివాస్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *