fbpx

ఓటు అడిగే హక్కు జగన్ కోల్పోయారు : జ్యోతుల నవీన్

Share the content

రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ, మాయ చేయడానికి మేదరమెట్లకు 6 జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుండి ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో వంద కోట్లు ఖర్చు చేసి జనాన్ని తరలించే ప్రయత్నం చేశారు. అయినా సభ వెలవెలబోయింది. అందుకే మీడియాపై ఆంక్షలు పెట్టారు. జగన్ ది వాపే గానీ బలం కాదని తేలిపోయిందని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ విమర్శించారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…బాబాయి గొడ్డలివేటు పాపంతో పులివెందులలో ఎలా గెలుస్తావో చూసుకో జగన్ అని హెచ్చరించారు. జగన్ అధికారంలో కి వచ్చిన తరువాత 85% హామీలు అమలు చేయకుండా మాట తప్పారని విమర్శించారు. మద్య నిషేధం చేశాకే ఓటు అడుగుతానన్న జగన్. మాట తప్పి మడమతిప్పాడు. ఓటు అడిగే హక్కు కోల్పోయాడు. నాసిరకం మద్యం పోసి 35 లక్షల మంది ఆరోగ్యాలు నాశనం చేశాడు. నాసిరకం మద్యం వల్ల కిడ్నీ, లివర్ చెడిపోయి 30,000 మంది ప్రాణాలు పోయి, వారి భార్యల మాంగల్యాలు మంట కలిశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకం మద్యంలో జగన్ లక్ష కోట్లు కమిషన్ కొట్టేశాడు. అందుకే డిజిటల్ పేమెంట్స్ లేకుండా చేశారని పేర్కొన్నారు.
3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి మాట తప్పాడు.అధికారంలోకి వచ్చిన వారంలో.. సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి మాట తప్పాడు.

మాట తప్పాడు…… మడం తిప్పాడు

అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా రూ.1000 పెంచుతానని హామీ ఇచ్చి మాట తప్పాడు. విద్యుత్ చార్జీలు పెంచనన్న హామీకి విరుద్ధంగా 9సార్లు పెంచి.. రూ.64 వేల కోట్ల కరెంటు చార్జీల భారం ప్రజలపై మోపి మాట తప్పారని పేర్కొన్నారు. ఇసుక సరఫరాపై మాట తప్పాడు. ఉచిత ఇసుకను రద్దు చేసి రూ.50 వేల కోట్ల కుంభకోణం చేశాడు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి పోగొట్టారని తెలిపారు. ఇద్దరు బిడ్డలకు అమ్మ ఒడి హామీపై మాట తప్పాడు. అమ్మ ఒడికి రూ.13,000 ఇచ్చి నాన్న బుడ్డిలో లక్ష కొట్టేస్తున్నాడు. ఇలా నవరత్నాలను నవమోసాలు చేశాడు. ఫీజు రీయంబర్స్ మెంట్ చంద్రబాబు 16 లక్షల మందికి ఇవ్వగా.. దాన్ని జగన్ 9 లక్షలకే కుదించి 7 లక్షల మంది విద్యార్థులకు నష్టం చేశాడు. రైతు భరోసాకు రూ. 12,500 హామీపై మాట తప్పాడు. రాష్ట్ర నిధుల నుండి రూ.7,500 మాత్రమే ఇస్తున్నాడు. కేంద్రం ఇచ్చే రూ.6,000 తానే ఇచ్చినట్టుగా అబద్ధాలు చెబుతున్నాడు. పైగా ఒక్కో రైతుకు లక్ష రూపాయలు లబ్ది చేకూర్చిన రైతు రుణమాఫీని రద్దు చేశాడు.

ఒక్కో కుటుంబం పై రూ. 8 లక్షల భారం

ధరలు, పన్నులు, చార్జీలు, అప్పుల బాదుడుతో ఒకే కుటుంబంపై జగన్మోహన్ రెడ్డి రూ. 8లక్షల భారం మోపారన్నారు. ఇచ్చేది గోరంత, కొట్టేసేది కొండంత. అన్న క్యాంటీన్లు, పండగ కానుకలు, నిరుద్యోగ భృతి, పసుపు కుంకుమ లాంటి 120 చంద్రన్న సంక్షేమ పథకాలు రద్దు చేశారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు ఒక లక్ష కోట్లు దారి మళ్ళించాడు. 14 లక్షల అసైన్మెంట్ భూములను వైసీపీ మూకలు కబ్జా చేశారు.ప్రశ్నించిన దళిత, బడుగు, బలహీన వర్గాల 1000 మందికిపైగా హత్యలు చేశారు.జగన్ పాలనలో అన్ని వర్గాలు నష్టపోయాయి. నేర పాలనలో ఐదు కోట్ల మంది బాధితులే. బాధితులందరూ ఏకమయ్యారు. ప్రజా ఆకాంక్ష మేరకు టీడీపీ, జనసేన, బీజేపీ ఒకటై నియంత దోపిడీని అంతం చేస్తామని జగన్ భయపడుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *