ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ను పట్టిపీడిస్తున్న రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి అని ఆ రాక్షసుడి చెరనుండి రాష్ట్రాన్ని విడిపించేందుకు ఈనెల 11, వ తేదీ నుండి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం పూరించనున్నరని కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వనరులు దోచుకొని, అన్ని రంగాల వారికి అన్యాయం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి ఆయన బృందానికి మాత్రమే దక్కుతుందని పేర్కొన్నారు.వైసీపీ పట్ల ఇప్పటికే ప్రజలు విసిగి చెందారని.. రాష్ట్ర ప్రజలందరికీ నేను ఉన్నాను అంటూ భరోసాగా నిలుస్తున్న తమ నాయకుడు లోకేష్ కు అండగా నిలవాలని కోరారు.శంఖారావం కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు