రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ రోజూ కూడా ఆయన జేబులో నుంచి రుపాయి తీయరు..తాను మాత్రం సొంత సొమ్మును కోట్ల రూపాయలను తీసి కష్టాల్లో ఉన్నవారికి ఇచ్చే వ్యక్తిని అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.ఇటీవల వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన జనసేన పార్టీ క్రియాశీల సభ్యుల కుటుంబాలకు పార్టీ మించి బీమా సాయాన్ని బుధవారం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అందచేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..జనసేన,టిడిపి ప్రభుత్వం వస్తే…ప్రస్తుతం ఇస్తున్న సంక్షేమ పథకాలు అన్ని ఆగిపోతాయని సిఎం జగన్మోహన్ రెడ్డి అసత్య చేస్తున్నారని మండిపడ్డారు.తన వ్యక్తిగత సంపదాననే ప్రజలు కష్టాల్లో ఉంటే పంచే మనస్తత్వం ఉన్నవాడిని..ప్రజలు కట్టిన పన్నులు, ప్రజాధనం ఇంకెంత ఉదారంగా అందిస్తానో ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.జనసేన,తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలు అన్ని కొనసాగుతాయని హామీ ఇచ్చారు. తమ స్వయంకృషితో దేశానికి ఆదర్శంగా నిలిచిన డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేసి ప్రోత్సహించే విషయం ఖచ్చితంగా మా దృష్టిలో ఉంది.డ్వాక్రా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మా దృష్టికి వచ్చాయి.రుణాల విషయంలో వారి సమస్యలు తెలుసుకున్నాం.రాబోయే జనసేన,టిడిపి ప్రభుత్వంలో మాఫీ చేసే అంశాన్ని అధ్యయనం చేస్తున్నాం.రద్దు దిశగా సాధ్య సాద్యాలు పరిశీలిస్తున్నామని అని తెలిపారు.