జనసేన పార్టీలోకి చేరిన సందర్భంగా తాడేపల్లిగూడెం లో పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ , కాకినాడ రూరల్ జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ లను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నట్లు మల్లాడి రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకై కృషి చేస్తామన్నారు. కాకినాడ సిటీ లో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలుకు, వీర మహిళలకు అండగా ఉంటానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం జెండా ఎగరవేయడం ఖాయమని మల్లాడి తెలిపారు . ఈ కార్యక్రమంలో 20వ డివిజన్ ఇంచార్జి బస్వాని నాగబాబు. పదో డివిజన్ ఇంచార్జ్ దాసరి వీరబాబు. పినిశెట్టి సురేష్ దారపు శిరీష. అగ్నికుల క్షత్రియ యూత్ ఫోర్స్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మల్లాడి రాజు సంగాడినటరాజు కొల్లాటి లోవరాజు కరిస్వామి బొడ్డురాజు పెమ్మాడి దుర్గాప్రసాద్ ఓలేటి శివరాం తదితరులు పాల్గొన్నారు.