fbpx

ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జనసేన బలోపేతానికి కృషి : గెడ్డం శివ

Share the content

రాజమండ్రి రూరల్ కడియం మండలం బుర్రిలంక గ్రామానికి చెందిన గెడ్డం శివ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రచార కమిటీ కో ఆర్డినేటర్ గా నియమితులయ్యారు. గతంలో చిరు సేవాసమితి అధ్యక్షులుగా 25 సంవత్సరాలుగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఎంతోమందికి ప్రాణదానం చేశారు. ప్రజారాజ్యంలో జిల్లా సెక్రెటరీ గాను, యువరాజ్యం ఉపాధ్యక్షులుగాను బాధ్యతలు నిర్వహించారు. ప్రసార కమిటీ కోఆర్డినేటర్ గా నియమితులైన శివను పలువురు అభినందనలు తెలియజేశారు. తనపై నమ్మకంతో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రసార కమిటీ కోఆర్డినేటర్ బాధ్యత అప్పగించిన రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ బలోపేతానికి తన సైన్యంతో నిరంతరం కృషి చేస్తానని శివ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *