fbpx

ఓటర్లపై కక్ష కట్టిన వైసిపి : నాగబాబు

Share the content

రాష్ట్ర ఓటర్లపై వైసిపి కక్ష కట్టినట్లు ఉన్నారు. కళ్లెదుటే ఓటమి కనిపిస్తుండటంతో అసహనం పెరిగిపోయి హింసకు పాల్పడుతున్నారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె నాగబాబు విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.పోలింగ్ అనంతరం కూడా ప్రజల పై దాడులు చేస్తున్నారు.వైసిపి డి.ఎన్.ఏ.లో నే హింస ఉందని మరోసారి వెల్లడైందని తెలిపారు. పల్నాడు జిల్లాలో మాచర్ల, నరసరావుపేట, సత్తెనపల్లి,గురజాల నియోజకవర్గాల్లో వైసిపి విశ్రంఖలంగా వ్యవహరిస్తూ ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తున్నారు.చంద్రగిరి నియోజకవర్గ టిడిపి అభ్యర్థి పులవర్తి నాని పై హత్యాయత్నానికి పాల్పడటం హింసకు పరాకాష్టగా మారింది.ఆళ్లగడ్డ టిడిపి అభ్యర్థి అఖిల ప్రియ గన్ మెన్ పై దాడికి దిగారు.పోలింగ్ రోజున రైల్వే కోడూరు లో జనసేన ఏజెంట్లను అపహరించి తీవ్రంగా గాయపరిచారని తెలిపారు.

స్ట్రాంగ్ రూమ్స్ వద్ధ భద్రత పెంచాలి

హింసకు పాల్పడ్డ వైసిపి వాళ్ళే ఎన్నికల సంఘాన్ని, పోలీసులను నిందించడం విడ్డూరంగా ఉంది.దొంగే దొంగ అని అరిచినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ.వి.ఏం.లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ వద్ధ భద్రతను మరింతగా పెంచాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ప్రజా తీర్పు వచ్చే జూన్ 4 న వైసిపి మరోసారి హింసకు పాల్పడే అవకాశం ఉన్నందున…పోలీస్ యంత్రాగం మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *