fbpx

ఆంధ్రాలో రాజకీయం వేగంగా మారిపోతోందా??

Share the content

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ముందస్తు ఎన్నికలు ఉంటాయని జోరుగా ప్రచారం జరుగుతుండడంతో ఈసారి త్రిముఖ పోరు ఉంటుందా లేక కూటమితో అధికార పక్షం పోటీ బలంగా ఉంటుంద అన్నది ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తుంది.

పవన్ మాటలతో…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారి తీస్తున్నాయి. కచ్చితంగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని ఆయన ప్రకటించారు. వైసీపీని ఉమ్మడి శత్రువుగా నిర్ధారించారు. అయితే దీనిపై తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల నుంచి కూడా స్పష్టమైన సంకేతాలు మాత్రం ఇంకా అందలేదు. గతంలోనే కుప్పంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై తమది వన్ సైడ్ లవ్ అనేలా కొన్ని వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై ఇరు పార్టీలకు ఇష్టం ఉండాలి అన్న ఇలా బహిరంగంగా మాట్లాడారు. మరోపక్క బీజేపీ సైతం తెలుగుదేశం పార్టీతో కలిసేది లేదని బలంగా చెబుతోంది. బిజెపి రాష్ట్ర నాయకులు సైతం చంద్రబాబు తీరు మీద పదేపదే విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మరి పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా సంయుక్తంగా అధికార పార్టీపై పోరాడడం సాధ్యమేనా లేదా అన్నది కాలం నిర్ణయించాలి.

వైసీపీ సన్నద్ధం

ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు వైసిపి పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం చెప్పకుండా సమయం ఇవ్వకుండా జగన్ ఏ సమయంలో అయినా అసెంబ్లీని రద్దు చేయవచ్చని వైసిపి నాయకులే చెబుతున్నారు. దీంతోపాటు అన్ని పక్షాలు సన్నద్ధమై ఒత్తులు కుదిరే వరకు జగన్ ఆగే పరిస్థితి కనిపించడం లేదు. వారికి ఏమాత్రం అవకాశం సమయం ఇచ్చిన వైసీపీకి దెబ్బ అనేలా సర్వేలు రావడంతో జగన్ అసెంబ్లీని వెంటనే రద్దు చేసి, ఎన్నికలకు వెళ్లేందుకు సదా సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేగంగా మార్పులు కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *