fbpx

జై జవాన్ జై కిసాన్ ద్వారా పేదల గుండెల్లో నిలిచారు.

Share the content

కాకినాడ జిల్లా బీజేపీ కార్యాలయంలో సోమవారం మాజీ ప్రధాని భారత రత్న ఆటల్ బిహారి వాజపేయి 99 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గౌతు చిన్నా ఆధ్వర్యయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముందుగా అటల్ బిహారీ వాజపేయి ఫోటోకి పుష్పాలంకరాణ చేసి వారు చేసిన అభివృద్ధి గురుంచి పలువురు నేతలు నేతలు ప్రసంగించారు.బిజెపి జిల్లా అధ్యక్షులు చిలుకూర్ రామ్ కుమార్ మాట్లాడుతూ జై జవాన్.. జై కిసాన్.. నినాధం వలన రైతులకు తగు ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నాలుగు లైన్లు రోడ్లు నిర్మించి స్వర్ణ చతుర్భుజి నిర్మించరాన్నారు.సర్వశిక్ష అభియాన్, గ్రామ సడక్ యోజన అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర సెక్రటరీ బొల్లిశెట్టి రామకృష్ణ, జిల్లా వైస్ ప్రెసిడెంట్ కవికొండల భీమశేకర్ , పెండెం సత్యన్నారాయణ , జిల్లా సెక్రటరీ మోసలిగంటి సురేష్ , సత్యానందం, నాగు, పవన్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *