ఆంధ్రపదేశ్ ఎన్నికల్లో హాంగ్ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ జోస్యం చెప్పారు. మహారాష్ట్ర లో శివసేన, ఎన్ సీపీ పార్టీలను చీల్చి బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని వివరించారు. అందులో భాగంగానే చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిలు బిజెపి అనుకూల ప్రభుత్వానికి ద్వారక పాలకులుగా ఉంటారని ఎద్దేవా చేశారు.బుధవారం విజయవాడ లోని దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రంలో ప్రధాన పార్టీలలో షిండేలు ఉన్నారన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మొదటిసారి అవినీతి ప్రభుత్వమని…అభివృద్ధి లేని ప్రభుత్వమని..మాఫియా ప్రభుత్వమని విమర్శలు గుళ్ళించారు.తరువాత ఢిల్లీ పెద్దలు అవినీతి పరులంటూ జగన్మోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ లు ప్రతి విమర్శలు చేశారన్నారు.ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయరని అన్నారు.మోదీకి చిత్తశుద్ధి ఉంటే 45 వేల కోట్ల రూపాయలు అవినీతి చేసిన జగన్మోహన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
రాముడు ప్రచారం గిట్టుబాటు కాదు
పార్లమెంట్ ఎన్నికల్లో రాముడు ప్రచారం గిట్టుబాటు కాదని…మోదీ గ్యారంటీ ఎక్స్పెయిరి అయ్యిందని ఎద్దేవా చేశారు.మోదీకి, బిజెపికి వ్యతిరేఖంగా మాట్లాడేవారందరిపై ఈడి, సిబిఐ, ఐ.టి ల సంస్థలతో బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దేశంలో వందల కోట్లు అవినీతి చేసిన వారిని జైల్లో పెడుతున్నారు.45 వేల కోట్ల అవినీతి చేసిన వారు బెయిల్ మిద బయట తిరుగుతున్నారు.కానీ 15 లక్షల కోట్లు అవినీతి చేసిన వారు మాత్రం విదేశాల్లో హాయిగా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.ఎన్డీయే కూటమికి వ్యతిరేఖంగా ఇండియా కూటమి పని చేస్తుందని అన్నారు.రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమని గెలిపించాలని కోరారు.