fbpx

అక్రమ డబ్బుతో అధికారంలోకి వచ్చేందుకు వైసిపి ప్రయత్నం : కె.రామకృష్ణ

Share the content

రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ధన రాజకీయాలను తిరస్కరించి..ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు.ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇసుక ,అక్రమ మైనింగ్ ,మద్యం కుంభకోణాల ద్వారా అక్రమంగా సంపాదించిన డబ్బుతో మరోసారి వైసిపి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. వైసిపి ఐదేళ్ల పాలన రివర్స్ లో నడిచింది. అభివృద్ధి అటకెక్కిందని ఎద్దేవా చేశారు.మరో పక్క దేశ ప్రజలును మత ప్రాతిపదికన చీల్చి మూడవసారి అధికారం చేపట్టేందుకు మోదీ విశ్వ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో జీవన స్థితిగతుల మెరుగుదల శూన్యం గా ఉంది.దేశ భవిష్యత్తు, అభివృద్ధి ప్రశ్నార్ధకం అయ్యింది.రాజ్యాంగం,లౌకికవాదం ప్రమాధంలో పడ్డాయి. ఈ తరుణంలో జరుగుతున్న ఎన్నికలు ఎన్నికలు దేశ భవిష్యత్తు ను మలుపు తిప్పే ఎన్నికలుగా భావిస్తున్నాం అని పేర్కొన్నారు.రాజ్యాంగాన్ని రక్షించడానికి,ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి దేశ వ్యాప్తంగా 28 రాజకీయ పార్టీలు ఇండియా కూటమిగా పోటీ చేస్తున్నాయి.కాంగ్రెస్, సీపీఐ ,సిపిఎం రాష్ట్రంలో ఇండియా కూటమి పార్టీలుగా ఉన్నాయి.రాష్ట్ర ప్రజలంత ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *