fbpx

టోఫెల్ టోపీ.. ప్రజాధనం లూటి.

Share the content

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం కాకపుట్టిస్తుంది. అధికార పార్టీ వైసీపీని గద్దె తింటడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ విధానాలను ఎండ కొడుతున్నాయి. రాష్ట్రంలో విద్యాసంస్థను మెరుగుపరుస్తామంటూ వైసిపి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో చేస్తున్న మార్పులు రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టే విధంగా ఉన్నాయని జనసేన పిఎసి చీఫ్ నాదెండ్ల మనోహర్ మండపడ్డారు. టొఫెల్ విద్యా పేరుతో మరోసారి ప్రజాధనాన్ని కొల్లగొట్టి.. ఆంధ్ర ప్రజలకు టోపి పెట్టడానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధమైంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, ఎన్నడూ చూడని విధంగా పేద పిల్లల పేరుతో వేలకోట్ల రూపాయలు పక్కదారి పట్టించడానికి వైసీపీ రంగం సిద్ధం చేసుకుంది. విద్యార్థులకు ఏమాత్రం ఉపయోగపడని టొఫెల్ ను విద్యార్థులపై బలవంతంగా రుద్దుతూ, ఆ ముసుగులో వేల కోట్ల రూపాయలను జేబులో వేసుకునేందుకు వైసీపీ నేతలు రెడీ అయ్యారని మనోహర్ అన్నారు. తెనాలిలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ” టొఫెల్ పరీక్ష అనేది డిగ్రీ పూర్తయిన విద్యార్థులు ఒకవేళ ప్రపంచంలో ఉన్న అత్యున్నత యూనివర్సిటీల్లో చదువుకోవడానికి వెళ్లాలని భావిస్తే, ముందుగా వారి ఇంగ్లీషు పరిజ్ఞానం తెలుసుకునేందుకు నిర్వహించే టెస్ట్. ఆయా యూనివర్సిటీలు టొఫెల్ పరీక్షలు నిర్వహిస్తాయి. అన్ని యూనివర్సిటీలు ఈ పరీక్షను నిర్వహించవు.. కొన్ని మాత్రమే నిర్వహిస్తాయి. జగన్ ప్రభుత్వం మాత్రం టొఫెల్ పరీక్షను మూడో తరగతి నుంచి పదవ తరగతి చదివే పిల్లలకు మూడేళ్ల పాటు నిర్వహించాలని భావిస్తోంది. ఈ ఏడాది నుంచి 2027 వ సంవత్సరం చివరి వరకు ఈ పరీక్షను అన్ని తరగతుల వారీగా నిర్వహించేలా ఈటీఎస్ అనే సంస్థ తో ఒప్పందం కుదుర్చుకుంది. దీనికోసం ప్రతి ఏటా రూ.1052 కోట్లు ఖర్చు చేయనుంది. అంటే నాలుగు సంవత్సరాలకు కలిపి సుమారుగా 4 వేల కోట్లకు పైబడి ఈ పథకంలో ఖర్చు చేయనున్నారు. వచ్చే ఆరు నెలల్లో ఇంటికి వెళ్లబోయే ప్రభుత్వం, ఈటీఎస్ సంస్థ వెంటపడి మరి ఈ ఒప్పందం కుదుర్చుకోవడం వెనుక వైసీపీ పెద్దల స్వలాభం దాగుంది అని నాదెండ్ల మనోహర్ అన్నారు . కచ్చితంగా ఈ ఒప్పందం ఎందుకు చేసుకుందో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి అని అన్నారు.

టొఫెల్ పరీక్షను గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత విద్యార్థులు రాస్తారు. ఇది మూడవ తరగతి పిల్లలకు ఏమాత్రం పనికిరాదు. అలాగే పదో తరగతి పిల్లలు ఈ పరీక్ష రాసి, ఉత్తీర్ణులు అయినా వారికీ ఉపయోగం లేదు అని . వారు డిగ్రీ పూర్తి అయ్యే సమయానికి టోఫెల్ పరీక్ష ఉత్తీర్ణత గడువు 2 సంవత్సరాలు పూర్తవుతుంది. అంటే ఈ పరీక్షలో ఉత్తీర్ణత అయితే రెండు సంవత్సరాలు మాత్రమే అది ఉపయోగంలో ఉంటుంది. మరి అలాంటప్పుడు పదో తరగతి విద్యార్థులకు సైతం ఈ పరీక్ష ఏ మాత్రం ఉపయోగపడదు. దీనికోసం రాష్ట్రంలోని 1,06,00,316 మంది పిల్లలను కావాలని ఇబ్బంది పెట్టడం ఎందుకు..? అని ప్రశ్నించారు. ప్రయోజనం లేని టొఫెల్ కు రూ.4 వేల కోట్ల ఖర్చు ఎందుకు..? ప్రతి ఏటా అమెరికా చదువుకోవడానికి వచ్చే వారికీ నాలుగు లక్షల వీసాలను మాత్రమే ఇస్తోందిని . దానిలో సుమారు 45 వేల వీసాలు రెండు తెలుగు రాష్ట్రాలకు వస్తున్నాయి. అమెరికాలో చదువుకోవడానికి అంత మందిని అనుమతించినప్పుడు టొఫెల్ పరీక్షలు విద్యార్థులకు ఎందుకు ఉపయోగపడతాయి..? అనినాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి ఏటా 3.17 లక్షల మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్నారు. దీనిలో 1.20 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉంటారు. వీరంతా ఉన్నత చదువులు కోసం విదేశాలకు వెళ్లరు. ఒకవేళ వెళ్ళాలి అనుకున్న వారికి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న టొఫెల్ పథకం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. మరీ ఎందుకు ఈ పథకం అంత ఖర్చుపెట్టి అమలు చేస్తున్నారు అన్నది సందేహాస్పదంగా ఉంది అని అన్నారు . పోనీ ఇంగ్లీష్ విద్యలో చిన్నారులకు ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే అది కనిపించడం లేదు. రాష్ట్రంలో ఉన్న 1.81 లక్షల ఉపాధ్యాయుల్లో కేవలం 1200 మంది మాత్రమే ఇంగ్లీష్ ఉపాధ్యాయులు ఉన్నారు. మరి వారు ఈ పథకంలో పిల్లలకు ఎలా ఉపయోగపడతారు?? ఇంగ్లీషు రాని ఉపాధ్యాయులు పరీక్షకు పిల్లలను ఎలా సమయత్తం చేస్తారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అని,ఇలాంటి విచిత్రమైన ఆలోచన నాకు తెలిసి ప్రపంచంలో ఏ ప్రభుత్వ అధినేతకు వచ్చి ఉండదు. పేద పిల్లల పేరు చెప్పి వేలకోట్ల రూపాయలను పక్కదారి పట్టించడానికి ఈ పన్నాగం అని తెలుస్తోంది. ఒకరోజు సీబీఎస్సీ సిలబస్ అంటూ మరో రోజు ఐబీ సిలబస్ అంటూ… ఇంకోరోజు టొఫెల్ అంటూ విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారు. వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు అని అగ్రహారం వ్యక్తం చేస్తున్నారు . ఎందరో విద్యార్థులకు విదేశీ విద్య కల తీర్చే అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని కుదించారు. కేవలం ప్రపంచంలో 100 పేరెన్నికగన్న యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు మాత్రమే సహాయం అందిస్తామని చెప్పారు. పథకం పేరును మార్చేసి, గత నాలుగున్నర ఏళ్లలో 357 మంది విద్యార్థులకు, కేవలం రూ.45 కోట్లు సాయం చేసి మమ అనిపించారు. పథకం ముఖ్య ఉద్దేశాన్ని పక్కన పడేసారు అని దీన్ని పై ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించే అవసరం ఎంతైనా ఉందని నాదేండ్ల మనోహర్ అన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *