fbpx

మన పిల్లలు విద్య లో ప్రపంచంతో పోటీ పడాలి : జగన్మోహన్ రెడ్డి

Share the content

రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమం, తరతరాల పేదరికం సంకెళ్లను తెంపేసి, చదువులనే సంపదతో పెద్ద చదువుల పునాదుల మీద ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదిగేందుకు ఉపయోగపడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం అక్టోబరు–డిసెంబరు, 2023 త్రైమాసికానికి 9,44,666 మంది విద్యార్ధులకు లబ్ది చేకూరుస్తూ.. రూ.708.68 కోట్లను కృష్ణా జిల్లా పామర్రులో బటన్‌ నొక్కి తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా జమ చేశారు.ఈ సందర్బంగా జరిగిన బహిరంగసభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ… పెద్ద చదువులు చదువుకుంటున్న పేదింటి పిల్లల వారి పూర్తి ఫీజులు, పూర్తి డబ్బు మొత్తాన్ని వంద శాతం ఫీజును ఆ పిల్లల తల్లులకే ఇచ్చి, తల్లులే ఆ ఫీజులు కాలేజీలకు కట్టే ఈ జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని గత 57 నెలలుగా క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ తల్లులకు జమ చేస్తూ కొనసాగిస్తూ వచ్చాం.

రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతున్న 9.45 లక్షల మంది పిల్లలకు.. అంటే పెద్ద చదువులు చదువుతున్న మొత్తం పిల్లల సంఖ్యలో ఏకంగా 93 శాతం మందికి జగనన్న విద్యా దీవెన ద్వారా మంచి చేస్తూ పిల్లల పూర్తి ఫీజును మీ జగనన్న ప్రభుత్వమే కడుతోంది.

ఆలోచన చేయమని అడుగుతున్నాను. గతానికి ఇప్పటికి మధ్య చిన్న తేడా చెబుతాను.

ఆదాయ పరిమితినీ పెంచాం…
మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మంది పిల్లలను చదివించాలి, వారు బాగుపడాలి, ఏ పేదవాడూ తన పిల్లల చదువుల కోసం అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని, మనం వచ్చిన తర్వాత అర్హత ప్రమాణాలను పెంచాం. ఆదాయ పరిమితిని పెంచాం. గతంలో లక్ష రూపాయలకు పరిమితమైన ఇన్‌ కమ్‌ లిమిట్‌ ను, ఎస్సీలకు 2 లక్షల దాకా పరిమితమై ఉండేది. మనం వచ్చిన తర్వాత ఏకంగా 2.5 లక్షలకు పెంచి ఈరోజు 93 శాతం మందికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా మంచి చేయగలిగాం. ఫీజులు కూడా గతంలో మాదిరిగా ఇంతే కడతాం, ఇంత కన్నా ఎక్కువ కట్టాల్సి వస్తే మీ ఆస్తులు అమ్ముకోండి, మీ చావు మీరు చావడం అనే విధానానికి పూర్తిగా స్వస్తి చెప్పాం. పిల్లల చదువుల కోసం ఏ తల్లిదండ్రులూ ఇబ్బంది పడే పరిస్థితి రాకూండా పూర్తి ఫీజును కట్టే కార్యక్రమాన్ని భుజస్కంధాలపై వేసుకున్నాం. పిల్లలు ఇబ్బంది పడకూడదని ఏ త్రైమాసికం అయిపోయిన వెంటనే తల్లులకు ఫీజులు వేస్తూ కాలేజీల్లో ఫీజులు కట్టించే గొప్ప సంప్రదాయానికి నాంది పలికాం. పిల్లలకు పూర్తి ఫీజులు చెల్లించే విద్యాదీవనే కాకుండా.. పిల్లలు ఇబ్బంది పడకూడదని, జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి పాపకూ, బాబుకూ తల్లిదండ్రులకు మంచి చేసే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 57 నెలలుగా జరిపిస్తున్నాం.

మన పిల్లలు ప్రపంచంతో పోటీపడతారు…
మీ పిల్లల వయసు ఈరోజు మూడు సంవత్సరాలు కావొచ్చు, 3 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలలోపు ఎంతైనా కావచ్చు. వీరంతా కూడా శతమానం భవతి అన్న విధంగా కనీసం మరో 100 సంవత్సరాలు జీవించాల్సిన జనరేషన్‌ లో ఉన్న వారు. ఏ విషయంలో అయినా కూడా వీళ్లందరూ పోటీ పడేది ఎవరితో అన్నది ప్రతి ఒక్కరం ఆలోచన చేయాలి. పోటీ పడేది రాబోయే రోజుల్లో ఈ గ్రామం ఆ గ్రామం, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు, దేశంతో కాదు, రేప్పొద్దున వీళ్లు ప్రపంచంతో పోటీ పడతారు. గత 30 సంవత్సరాల్లో… అప్పటికి, ఇప్పటికి తీసుకుంటే వస్తువులు, సేవలు, టెక్నాలజీ అయినా ఎంతగా మారిపోయాయో, మారుతూ వస్తున్నాయో ఇవన్నీ కూడా మనమంతా చూస్తున్నాం.

నిలదొక్కుకోవాలటే నాణ్యతతో కూడిన చదువులు కావాలి.
ఇవాళ కావాల్సింది కేవలం అక్షరాలు నేర్చుకోవడం మాత్రమే అనుకొనే చదువులు కాదు.. ఏదో ఒక డిగ్రీ తీసుకుంటే పర్వాలేదని అనుకొనే చదువులు కాదు.. ఈరోజు కావాల్సిన చదువులు క్వాలిటీ చదువులు. ఇవాళ తరం రేపు భవిష్యత్‌ లో పోటీ ప్రపంచంలో నిలబడి గెలవగలిగే క్వాలిటీ చదువులు మన పిల్లలకు అవసరం.
ఈ నిజం, అవసరం తెలుసుకున్నా కాబట్టే మన పిల్లలందరూ భవిష్యత్తులో ప్రపంచంలో అతిపెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించుకొనేలా అడుగులు వేస్తూ వచ్చాం.

విద్యలో సమూల మార్పులు
ప్రాథమిక విద్యలో ప్రతి అడుగులోనూ మార్పులు తెచ్చాం. మనం వచ్చిన తర్వాతనే గవర్నమెంట్‌ బడులు మారాయి. ఇవాళ ఒకటో తరగతిలోమనం వేసే విత్తనం మరో 10–15 ఏళ్లలో చెట్టు అవుతుంది. మంచిభవిష్యత్‌ లేకపోతే చెట్టు ఒరిగిపోతుంది. అలా కాకుండా పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి, పెరగాలి, భవిష్యత్లో అందరికన్నా మన పిల్లలు లీడర్లుగా ఎదగాలి అని అడుగులు వేస్తూ వచ్చాం. మార్పులుతీసుకొచ్చాం.
నాడునేడుతో గవర్నమెంట్‌ బడులలో మార్పులు కనిపిస్తున్నాయి. ఇంగ్లీషు మీడియంతో పాటు గవర్నమెంట్‌ బడుల్లో సీబీఎస్‌ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం కనిపిస్తోంది.

పేదల చదువుల కోసం యుద్ధం
ఇంగ్లీషు మీడియం తెచ్చినందుకు మెచ్చుకోవాల్సింది పోయి.. ఒక చంద్రబాబుతో యుద్ధం చేయాల్సి వస్తోంది, ఈనాడు రామోజీ రావుతో యుద్ధం చేయాల్సి వస్తోంది. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతితో యుద్ధం చేయాల్సి వస్తోంది. టీవీ5తో యుద్ధం చేయాల్సి వస్తోంది. వీళ్లందరితో పాటు ఒక దత్తపుత్రుడితో కూడా యుద్ధం చేయాల్సి వస్తోంది. గవర్నమెంట్‌ బడులు మారాలని ఆరాటపడటం తప్పు. ఇంగ్లీషు మీడియం తేవాలని తపన పడటం తప్పు. ఇలా ఆరాటపడినందుకు ఇంత మందితో యుద్ధం చేయాల్సి వస్తోంది. మనపై యుద్ధం చేస్తున్న వీళ్లు, వీళ్ల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు కూడా ఏ మీడియంలో చదువుతున్నారని మీలో ఎవరైనా నిలదీస్తే మాత్రం ఏఒక్కరూ తెలుగుమీడియంలో చదువుతున్నారని చెప్పరు.
వాళ్ల పిల్లలేమో ఇంగ్లీషుమీడియం చదవాలి, కానీ మన పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదవాడానికి మీ జగన్‌ అడుగులు వేస్తే మాత్రం తెలుగు భాష అంతరించి పోతుందని ఏకంగా యాగీ చేస్తూ మనమీద యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు.

పెత్తందార్లకో ధర్మం– పేదలకు ఒక ధర్మం.
నేను చెబుతున్న ప్రతి మాటా ఆలోచన చేయమని కోరుతున్నాను. తల్లిదండ్రులు, పిల్లలందరూ గమనించాలి. పెత్తందార్లయిన వారికో ధర్మమట. పేదలైన మీకో ధర్మమట. వారి పిల్లలకు ఓ బడి అంట. మన పిల్లలకు ఇంకో బడట. వారి చదువులు వేరట, మన చదువులు వేరట. పెత్తందార్లుగా వారుండాలట. పనివారిగా మనం ఉండాలట. పరిశ్రమలు వారివట. కార్మికులుగా మాత్రమే మనమట. సామ్రాజ్యాలన్నీ వారివట. సామాన్యులుగా మాత్రమే మనం మిగిలిపోవాలట, ఆలోచన చేయండి. వారి పిల్లల చేతుల్లో ట్యాబులుండొచ్చు. స్మార్ట్‌ ఫోన్లు ఉండొచ్చు. కానీ మన పిల్లల చేతుల్లో మాత్రం మీ జగన్‌ పిల్లలకు ట్యాబులిస్తే మాత్రం పిల్లలు ట్యాబుల్లో ఏమేమో చూస్తూ చెడిపోతున్నారని యాగీ చేస్తారు. ఇవన్నీ ఎప్పటికీ మన పిల్లలు పేదలుగానే ఉండిపోవాలి అని కోరుకొనే పెత్తందారీ మనస్తత్వానికి నిదర్శనాలుగా మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి.

విద్యారంగంలోనూ క్లాస్‌ వార్‌…
ఇప్పుడు విద్యారంగంలో కూడా వారికి, మనకు మధ్య ఒక యుద్ధం జరుగుతుంది. క్లాస్‌ వార్‌ జరుగుతోంది.
పెత్తందార్లకు, పేదలకు మధ్య యుద్ధం, డబ్బులున్న వారికి ఒక చదువులు, డబ్బుల్లేని వారికి మరో చదువులుగా జరుగుతున్న యుద్ధం. ఈ క్లాస్‌ వార్‌లో బాబు మనుషుల దుర్మార్గరపు భావజాలం మీద… మీ కష్టాలు మీ భావాలు తెలిసిన మీ అన్నగా మీ తరఫున ఒక విప్లవంగా, తిరుగుబాటుగా విద్యారంగంలో అనేక సంస్కరణలు, మార్పులు తీసుకొచ్చాం. ఈ సంస్కరణలు, క్వాలిటీ ఎడ్యుకేషన్‌ లేకపోతే, ఈ విప్లవానికి అడుగులు ముందుకు పడకపోతే కూలీల పిల్లలు కూలీలుగానే, పనివారు పనివారుగానే, పేద సామాజిక వర్గాల పిల్లలు అదే పేదరికంలో మిగిలిపోయే ప్రమాదం ఉంది.అందుకే ఈ విప్లవం, తిరుగుబాటు జరగాలి. ఈ సంస్కరణలు వేగంగా అడుగులు పడుతూ పోవాలి. విదేశాల్లో గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాల్లో ఉన్న కోర్సులు సైతం ఆన్‌ లైన్‌ లో పిల్లలకు అందుబాటులోకి తీసుకురావడం వరకు ప్రతి ఒక్కటీ విప్లవాత్మక మార్పు. ఇవన్నీ ఎప్పుడూ చూడలేదు. మనం వచ్చే వరకు గవర్నమెంటు బడులలో ఇంగ్లిషు మీడయం కూడా ఎవరూ చూడలేదు. ఇవన్నీ 57 నెలల కాలంలోనే శ్రీకారం చుట్టాం.

అందుకే మన జగన్నాథ రథం కదులుతోంది…

అందులో భాగంగానే స్కూల్‌ ఎడ్యుకేషన్‌ లో సీబీఎస్‌ఈ నుంచి ఐబీ వరకు అడుగులు పడుతున్నాయి. 3వ తరగతి నుంచే ప్రభుత్వ బడులలో సబ్జెక్ట్‌ టీచర్‌ విధానాన్ని మీ అన్న పరిపాలనలోనే తీసుకొచ్చాం.ఏకంగా 3వ తరగతి నుంచే టోఫెల్‌ ఓరియెంటేషన్‌ తో శిక్షణ ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది ఈ 57 నెలల కాలంలోనే. మొట్ట మొదటి సారిగా గవర్నమెంట్‌ బడుల్లో బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌ ఒక పేజీ ఇంగ్లిషు, ఒక పేజీ తెలుగుతో మన పిల్లల చేతుల్లో కనిపిస్తున్నది కూడా ఈ 57 నెలల కాలంలోనే. ధనికుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉన్న బైజూస్‌ కంటెంట్‌ ను పేద పిల్లలు చదువుతున్న చదువులకు అనుసంధానం చేసింది కూడా ఈ 57 నెలల కాలంలోనే. మన పేద పిల్లలు కేవలం అక్షరాలు రాసే లిటరసీ నుంచి డిజిటల్‌ యుగాన్ని శాసించే రీతిగా ఎదగాలని, 8వ తరగతికి వచ్చిన వెంటనే పిల్లల చేతుల్లో ఏకంగా ప్రభుత్వం ట్యాబులు ఇచ్చింది కూడా ఈ 57 నెలల కాలంలోనే.

రూపురేఖలు మారిన 45 వేల స్కూళ్లు…
మొట్ట మొదటిసారిగా నాడునేడుతో స్కూళ్లన్నీ రూపురేఖలు మారుస్తూ, 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్‌ రూములో ఐఎఫ్‌ పీ ప్యానెల్స్‌ తీసుకొస్తూ అడుగులు పడింది కూడా ఈ 57 నెలల కాలంలోనే. పిల్లలను బడులకు పంపేలా ప్రోత్సహిస్తూ తల్లులకు ప్రతి సంవత్సరం రూ.15 వేలు ఇస్తున్నది కూడా ఈ 57 నెలల కాలంలోనే.
నాడునేడులో భాగంగా 45 వేల స్కూళ్లలో రూపురేఖలు మారుస్తూ 12 రకాల అంశాలను తీసుకొని ప్రతి స్కూళ్లో తీసుకొస్తూ అడుగులు పడింది కూడా ఈ 57 నెలల కాలంలోనే.
పిల్లలకు రోజుకో మెనూతో గోరుముద్ద అందిస్తున్నది కూడా ఈ 57 నెలల కాలంలోనే. ప్రతి మండలానికి కనీసం 2 జూనియర్‌ కాలేజీలుండాలని, అందులో ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం ఒకటిఉండాలని ఏర్పాట్లు చేస్తున్నది కూడా ఈ 57 నెలల కాలంలోనే.

ఐక్యరాజ్యసమితిలో మన ఆడపిల్లల ప్రసంగం…
ఐక్య రాజ్యసమితిలో మన పేద ఆడ పిల్లలు అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడిన ఘట్టం పేద పిల్లల చరిత్రను మనందరి ప్రభుత్వం ఎంతగా మలుపులు తిప్పుతోందో ప్రపంచానికి చాటి చెప్పిందో చూశాం. పెద్ద చదువులే చదువుతున్న పిల్లలకు మొట్ట మొదటి సారిగా 100 శాతం పూర్తిగా ఫీజులు చెల్లిస్తున్న పరిస్థితి కూడా కేవలం ఈ 57 నెలల కాలంలోనే. భోజన, వసతి ఖర్చులు కూడా భరిస్తున్న ప్రభుత్వం కూడా ఈ 57 నెలల కాలంలోనే. రూ.1.25 కోట్ల వరకు ప్రపంచ అత్యుత్తమ కాలేజీల ఫీజు సైతం… ప్రపంచ స్థాయిలో టాప్‌ 50 ర్యాంకుల్లో ఉన్న 21 ఫ్యాకల్టీస్‌ లో 330 కాలేజీల్లో సీటు మీరు తెచ్చుకోండి రూ.1.25 కోట్ల వరకు సపోర్ట్‌ చేసి శ్రీకారం చుట్టింది కూడా ఈ 57 నెలల కాలంలోనే. చదువుతున్న పిల్లల డిగ్రీలకు ప్రయోజనం ఉండేలా మొదటిసారి ఒక ముఖ్యమంత్రిగా పిల్లలు ఏం చదువుతున్నారు, కరిక్యులమ్‌ లో మార్పులు తీసుకురావాలి, భావి పౌరులుగా నిలబెట్టడానికి చదువుల్లో ఏమేం మార్పులు తీసుకురావాలన్న ఆలోచన చేసిన ముఖ్యమంత్రి కేవలం మీ అన్న మాత్రమే.

జాబ్‌ ఓరియెంటెడ్‌గా కరిక్యులమ్‌….
మొట్ట మొదటి సారిగా కరిక్యులమ్‌ లో మార్పులు ఈ 57 నెలల కాలంలోనే మీ అన్న ప్రభుత్వమే తెచ్చింది.
కరిక్యులమ్‌ ను జాబ్‌ ఓరియెంటెండ్‌ గా మార్చాం. నాలుగేళ్ల ఆనర్స్‌ కోర్సులు తెచ్చాం. 10 నెలల తప్పనిసరి ఇంటర్న్‌ షిప్‌ అన్నది తీసుకొచ్చింది ఇప్పుడే. మొదటిసారి మన కరిక్యులమ్‌ లో సర్టిఫైడ్‌ ఆన్‌ లైన్‌ వర్టికల్స్‌ ను తీసుకొచ్చింది కూడా ఈ 57 నెలల కాలంలోనే. మొట్టమొదటిసారిగా చదువుల్లోకి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్, వర్చువల్‌ రియాలిటీ, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తూ అడుగులు వేయించింది కూడా ఈ 57 నెలల కాలంలోనే. మన కాలేజీల్లో డిగ్రీ చదవడం వల్ల దేశీయంగా, విదేశీయంగా కూడా మనకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బందులు పడే పరిస్థితి ఉండకూడదని, అక్కడ ఉన్నదేమిటి?, ఇక్కడ లేనిదేమిటి? అని ఆలోచన చేసి, అక్కడ సబ్జెక్టుల్లో ఉన్న వర్టికల్స్‌ ను ఇక్కడ కూడా ఉండేట్టుగా ఆన్‌ లైన్‌ లో మన పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమానికి అడుగులు వేసింది కూడా కేవలం ఈ 57 నెలల కాలంలోనే.

ప్రపంచ అత్యుత్తమ యూనివర్సిటీల నుంచి అందుబాటులో 2వేల ఆన్‌లైన్‌ కోర్సులు.
మొట్ట మొదటిసారిగా ఈరోజు మన చదువుల్లో కరిక్యులమ్‌లో భాగంగా, మన సబ్జెక్ట్‌ వర్టికల్స్‌ లో భాగంగా ఎంఐటీ నుంచి ఏఐ, పెన్సిల్వెనియా యూనివర్సిటీ నుంచి రోబోటిక్స్, మేరీల్యాండ్‌ వర్సిటీ నుంచి వర్చువల్‌ బిల్డింగ్‌ డిజైన్స్, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ నుంచి ఇంటెలెక్చువల్‌ కమ్యూనికేషన్, ఈక్విటీ పోర్ట్‌ ఫోలియో మేనేజ్‌ మెంట్‌ న్యూయార్క్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌( ఎన్‌ వైఐఎఫ్‌) నుంచి, రిస్క్‌ రిటర్న్‌ మేనేజ్‌ మెంట్‌ కొలంబియా యూనివర్సిటీ నుంచి, సప్లై చైన్‌ మేనేజ్‌ మెంట్‌ ఎంఐటీ నుంచి, ఇన్వెస్ట్‌ మెంట్‌ మేనేజ్‌ మెంట్, ఇన్వెస్ట్‌ మెంట్‌ బ్యాంకింగ్‌ నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌ నుంచి, రియల్‌ ఎస్టేట్‌ మేనేజ్‌ మెంట్‌ ఎంఐటీ నుంచి.. ఇలా ప్రఖ్యాత యూనివర్సిటీల్లో ఉన్న దాదాపు 2 వేల కోర్సులన్నీ ఆన్‌ లైన్‌ ద్వారా మన కరిక్యులమ్‌ లో భాగాలై చదువులు చెబుతూ పరీక్షలు పెట్టి పిల్లలకు సర్టిఫికెట్లు కూడా వాళ్లే ఇచ్చేట్టుగా మొట్ట మొదటి సారి అడుగులు పడింది కూడా కేవలం ఈ 57 నెలల్లోనే. పేదరికం సంకెళ్లు తెంచేందుకే విద్య కోసం వేల కోట్లు ఖర్చు. ఇది ఎప్పుడూ, ఎవరూ ఊహించని మార్పు. ఎందుకు ఇవన్నీ చెబుతున్నానంటే మన పిల్లలందరికీ వాళ్ల చదువులు మారాలి. విద్యారంగంలో ప్రతి మార్పు వెనుక, చేస్తున్న వేల కోట్ల ఖర్చు వెనుక, మన పేద పిల్లలు ఇకనైనా పేదరికం సంకెళ్లను తెంచుకొనే స్థాయి రావాలి.


ఈరోజు మనం వేసిన విత్తనం.. ఈ మార్పులన్నీ మరో 10–15 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటాయో ఊహించుకోండి.
ఈ రోజు విత్తనం వేస్తున్నాం. రానున్న పది, పదిహేను సంవత్సరాల్లో ఈ విత్తనాలన్నీ అద్భుతమై ఫలితాలిచ్చే పరిస్థితి వస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడుతూ ఐబీ సర్టిఫికెట్లు చేతిలో పుచ్చుకొని హార్వర్డ్, ఎంఐటీ, ఎల్‌ ఎస్‌ సీ, ఎల్‌ బీఎస్‌ వంటి అంతర్జాతీయవర్సిటీల్లో అందుబాటులో ఉన్న కోర్సులు ఆన్‌ లైన్‌ లో సర్టిఫికెట్లను సొంతం చేసుకొని ఇంత క్వాలిఫైడ్‌ పర్సన్‌గా బయటకు వచ్చి మరో 10–15 సంవత్సరాల్లో ఉద్యోగాలకు అప్లికేషన్‌ పెడితే మన పిల్లలకు అంతర్జాతీయంగా పెద్ద పెద్ద మల్టీ నేషనల్‌ కంపెనీల ఉద్యోగాల్లో మన పిల్లలు అందరికన్నా ముందుగా ఉంటారు. బతుకులు, తలరాతలు మారుతాయి. పిల్లల భవిష్యత్తు మారుతుంది.

పేద వర్గాల పిల్లలకు బాబు చేసిన మంచి ఏమిటి?
ఈ రాష్ట్రంలోని పేద పిల్లవాడు, ప్రతి పాప తల్లిదండ్రులందరూ ఆలోచన చేయాలి.
చంద్రబాబు 14 సంవత్సరాలు 3 సార్లు సీఎంగా పని చేశాడు. పేద వర్గాల పిల్లల గురించి ఆయన చేసిన ఆలోచన ఏమిటి? ఆయన చేసిన మంచేమిటి? పేద పిల్లల భవిష్యత్‌ మార్చాలని మీ అన్న చూపించిన తాపత్రయంలో కనీసం ఒక్క శాతమైనా చంద్రబాబు చూపించాడా? ఆలోచన చేయాలి. గవర్నమెంట్‌ బడిని అదే చంద్రబాబు చేసిందేమిటి? ఆయన చేసిన మంచేమిటి అంటే ఏ ఒక్కరికీ ఏదీ గుర్తుకురాదు.

ప్రభుత్వ బడిని నీరుగార్చిన చంద్రబాబు…
కానీ చంద్రబాబు పేరు చెబితే మాత్రం ఆయన విద్యారంగంలో చేసిన చెడు మాత్రం చాలా చెప్పుకోవచ్చు. గవర్నమెంట్‌ బడిని నీరుగార్చింది చంద్రబాబు. నారాయణ, చైతన్య సంస్థల్ని పోషించిన వ్యక్తి చంద్రబాబు. అక్కడ డబ్బులు కట్టిన వారికి మాత్రమే ఇంగ్లీషు మీడియం, ఇక్కడ గవర్నమెంట్‌ బడుల్లో మాత్రం తెలుగు మీడియం. ఇలా నిర్దేశించింది చంద్రబాబు. పిల్లలకు గవర్నమెంట్‌ బడుల్లో ఎలాంటి ఆహారం అందుతుందో చంద్రబాబు ఏనాడు కనీసం ధ్యాస పెట్టలేదు. బైజూస్‌ కంటెంట్, పిల్లలకు ట్యాబులు, డిజిటల్‌ బోధన అంతకన్నా లేదు. నాడునేడుతో స్కూళ్లు బాగుపరచాలన్నది లేదు. ఇంగ్లిషు మీడియం గవర్నమెంటు బడులలో లేదు. అమ్మ ఒడి దిశగా అడుగులు వేసింది లేదు. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు పూర్తిగా ఫీజులు కట్టాలన్న ఆలోచన ఏరోజూ చేయలేదు.

విద్యాదీవెన పరిస్థితి ఇలా ఉంటే ఇక వసతి దీవెన కథ దేవుడెరుగు.
అంతర్జాతీయ విద్యా సంస్థలతో అనుసంధానం చేస్తూ మన కరిక్యులమ్‌ లో మార్పులు తెచ్చింది ఒక బోడి సున్నా. విదేశీ విద్యా దీవెన ఏకంగా రూ.1.25 కోట్ల దాకా చదివించే బాధ్యత నాదీ అన్న ప్రోత్సాహకర మాటలు ఏదీ లేదు. ఈ రాష్ట్రంలో ఆయన చేసిన పరిపాలన వల్ల మంచి జరిగింది ఇదీ అన్నది ఒక్కటంటే ఒక్కటీ లేదు. గ్రామంలో, సామాజిక వర్గాలకు, అవ్వాతాతలకు, రైతన్నలకు, అక్కచెల్లెమ్మలు, చదువుకుంటున్న పిల్లలు, జాబుల కోసం వెతుక్కుంటున్న పిల్లలకు ఇది చేశానని చెప్పే పరిస్థితి లేదు.

మారీచులతో యుద్ధం చేస్తున్నాం…
ఇలాంటి వ్యక్తులతో యుద్ధం జరుగుతోంది. మారీచులతో యుద్ధం చేస్తున్నాం. మంచి చేయడానికి మీ బిడ్డ, మీ అన్న నాలుగు అడుగులు ముందుకేస్తే 8 అడుగులు వెనక్కు లాగాలన్న శక్తులతో యుద్ధం చేస్తున్నాం.
వాళ్లు చేస్తున్న యుద్ధం కేవలం జగన్‌ తో కాదు. జగన్‌ అనే ఒక్కడు పక్కకు తప్పుకుంటే జరిగే నష్టం ఏమిటన్నది ప్రతి ఇంట్లో ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి పాప, పిల్లాడు ఆలోచన చేయాలి.

జగన్‌ అన్న వ్యక్తి పక్కకు పోతే…
జగన్‌ అనే ఒక్కడు పక్కకు పోతే పిల్లల చదువులు ఉండవు, గవర్నమెంట్‌ బడుల్లో ఇంగ్లీషు మీడియం ఉండదు, 100 శాతం ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ కథ దేవుడెరుగు. విద్యారంగం గాలికిపోతుంది.
ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష, పేదవాడికి ఇంటికే మందులిస్తున్నది, వ్యవసాయం గాలికి ఎగిరిపోతుంది, రైతన్న పూర్తిగా చతికిలబడిపోతాడు, అక్కచెల్లెమ్మల బతుకులు చిన్నాభిన్నం అవుతాయి.
కేవలం పేదవాడికి తోడుగా నిలబడుతూ.. పేదవాడి భవిష్యత్‌ కోసం యుద్ధం చేస్తున్నది కేవలం మీ జగన్‌ మాత్రమే. అందుకనే ప్రతి ఒక్కరికీ చెబుతున్నాను. వాళ్లు చెప్పే అబద్ధాలు నమ్మకండి. మోసాలు నమ్మకండి. రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు, మోసాలు చెబుతారు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్‌ కారు కొనిస్తామంటారు.

మీ జగన్‌ వల్ల మంచి జరిగితే తోడుగా నిలబడండి.
మీ ఇంట్లో ఎవరు మంచి చేశారు, ఎవరి హయాంలో మంచి జరిగిందని ఆలోచన చేయాలి.
మీ ఇంట్లో మీ జగన్‌ వల్ల మంచి జరిగి ఉంటే మాత్రం మీ అన్నకు తోడుగా మీరే ప్రతిఒక్కరూ అడుగులు ముందుకు వేయండి, సైనికులుగా నిలబడండి. నేను చెప్పే ఈ మాటలు కచ్చితంగా గుర్తుపెట్టుకొండి. ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దేవుడి దయ ప్రజలందరి చల్లని దీవెనలతో ఇంకా మంచి చేసే కార్యక్రమం గొప్పగా రావాలి, జరగాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *