దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు వేలు రూపాయలు పెన్షన్ పెంచడం జరిగిందని, అభివృద్ధి సంక్షేమంతో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తుందని మాజీ మంత్రి వైకాపా కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడ రూరల్ మండల అభివృద్ధి కార్యాలయంలో శుక్రవారం ఎండిఓ కర్రే స్వప్న, డిఎల్డిఓ పాఠంశెట్టి నారాయణమూర్తిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కన్నబాబు హాజరు అయ్యి నూతన ఫించన్ లను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కిడ్నీ బాధితులు గాని పక్షవాత బాధితులు, వితంతువులకు, అవ్వ, తాతలకు, వికలాంగులకు పెన్షన్లు అందివ్వడం ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక కొత్త పుంతలు తొక్కుతూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి మాటల ముఖ్య మంత్రి కాదని చేతల ముఖ్యమంత్రిని అని తెలియజేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం లో సుమారు 35 వేల పైచిలుకు పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోపిశెట్టి పద్మజా బాబ్జి, జడ్పిటిసి నురుకుర్తి రామకృష్ణ, సర్పంచులు బెజవాడ వీర వెంకట సత్యనారాయణ, రాందేవ్ చిన్న, పుల్ల చక్ర,ర రావు, ఆనంద్ కుమార్ఎంపీటీసీలు, మరియు కార్యకర్తలు సిబ్బంది అభిమానులు పాల్గొన్నారు.