ఇటీవల మంత్రి రోజా మీద తీవ్ర వ్యాఖ్యలు చేసి… అరెస్టు కూడా అయిన టీడీపీ సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి కి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం కష్టమే అనేది టీడీపీ నాయకుల మాట. క్యాబినెట్ మినిస్టర్ మీద ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం అది జాతీయ స్థాయిలో సంచలనం కావడంతో, వచ్చే ఎన్నికల్లో ఆయనను పక్కన పెట్టి పెందుర్తి సీటు కచ్చితంగా జనసేనకు కేటాయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెందుర్తి సీటు మీద జనసేన ఆశలు పెట్టుకున్న తరుణంలో సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తికి ఎలాంటి న్యాయం చేస్తారు అన్న సందిగ్ధం ఇప్పటివరకు ఉండేది. అయితే అనుకోకుండా ఆయన రోజా మీద వ్యాఖ్యలు చేయడం అవి అరెస్టుకు దారి తీయడంతో పాటు.. బండారు చేసిన వ్యాఖ్యలు అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకతను తీసుకొస్తున్న తరుణంలో దానిని తెలుగుదేశం పార్టీకి అంటుకోకుండా చేయాలి అంటే కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు ఇవ్వకుండా ఉండడమే ఉత్తమం అని భావిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పెందుర్తి సీటు కచ్చితంగా జనసేన పార్టీకి కేటాయించే అవకాశం 100% కనిపిస్తోంది.
** ఇటీవల విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి జనసేనలో చేరిన పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి సీటును ఆశించి జనసేనలో జాయిన్ అయ్యారు. అయితే స్థానికంగా తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్ నేతగా పేరు ఉన్న బండారు సత్యనారాయణమూర్తి ఉండడంతో పంచకర్ల రమేష్ బాబుకు వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి సర్దుబాటు చేస్తారు అనే ప్రశ్న మొదట్లో ఉండేది. అయితే ప్రస్తుతం ఎలాంటి సమస్య లేకుండా వచ్చే ఎన్నికల్లో రమేష్ బాబుకు పూర్తిస్థాయిలో లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. జనసేన తెలుగుదేశం పార్టీలో భాగంగా విశాఖ జిల్లాలో జనసేనకు కేటాయించే సీట్లలో పెందుర్తి కచ్చితంగా చేరినట్లేనని తెలుస్తోంది. పంచకర్ల రమేష్ బాబుకు పెందుర్తి నియోజకవర్గం లో పూర్తిస్థాయి పట్టు ఉండడంతో పాటు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కూడా ఉండడంతో కచ్చితంగా అక్కడ నుంచి గట్టి పోటీ ఇస్తారని జనసేన నేతలు భావిస్తున్నారు. దీంతో వచ్చి ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గంలోనూ జనసేన వైసీపీ సమరం బలంగా ఉంటుందని ఇప్పటికే అంచనాలు నెలకొన్నాయి. దాదాపు పంచకర్ల రమేష్ బాబు పూర్తిస్థాయిలో అంతా సెట్ అయినట్లేనని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.