fbpx

కొవ్వాడలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

Share the content

నిన్ను వలె, ని పొరుగు వారిని ప్రేమించాలని, ఏసుక్రీస్తు చూపిన ప్రేమ, దయ, కరుణ, కనికరముతో ప్రతి ఒక్కరు జీవించాలని కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు, వైసిపి జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు తెలిపారు. శనివారం కొవ్వాడ గ్రామంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. రూరల్ ఎంపీపీ గోపిశెట్టి పద్మా, బాబ్జిల ఆధ్వర్యంలో ఏఎంసీ డైరెక్టర్ జాను ప్రభాకర్ అధ్యక్షతన క్రిస్మస్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు ఈ భూమిపై పుట్టినప్పటి నుండి ప్రజల పట్ల తన చూపించిన దయ, కరుణ, సమానత్వమును కలిగి ప్రతి ఒక్కరు జీవించాలని,ఏ పాపం ఎరుగని దైవ కుమారుడు పాపుల కొరకు తన ప్రాణం పెట్టి పాప విమోచన కలిగించారని తెలిపారు. ప్రతి ఒక్కరూ అటువంటి ప్రేమాభిమానాలు కలిగి జీవితం కొనసాగించాలని ఆకాంక్షించారు.

రాబోయే ఎన్నికల్లో మళ్లీ వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టేలా ప్రార్ధనలు చేయాలని ఈ సందర్భంగా సూచించారు. అనంతరం మహిళలకు చీరలు, మగవారికి దుప్పట్లను పంపిణీ చేశారు. గత కొన్ని ఏళ్లగా ప్రతి క్రిస్మస్ పండుగకు ఈ విధంగానే నూతన వస్త్రాలు, వృద్ధులకు దుప్పట్లు ఇస్తూ వచ్చినట్లుగా గ్రామ పెద్దలు తెలిపారు. ఒకరికొకరు చిన్నచిన్న విభేదాలు ఉన్నప్పటికీ ఈ క్రిస్మస్ పండుగకు ప్రతి ఒక్కరు కుటుంబాలతో కలిసి తమ ఆనందాన్ని పంచుకుంటారని గ్రామ పెద్దలు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు దామెర రంగబాబు, కొవ్వాడ గ్రామ సర్పంచ్ ఉమా సతీష్, ఉప సర్పంచ్ తోటకూర శ్రీనివాస్, రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోటిపల్లి శ్రీనివాస్, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, రాష్ట్ర యువజన విభాగ నాయకులు లింగమ్ రవి, సుందరపల్లి పాల్, నెల్లి ధనరాజ్ , నెట్ల కృష్ణ, కృపారావు, చాంద్ బాషా, గ్రామ ప్రజలు, వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు, ఇతర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *