రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ లు ఎదుర్కొంటున్న పలు సమస్యల పై కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకత్వం గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డి ని విజయవాడ లో కలిసి వినతిపత్రం సమర్పించారు. సిఐటియి,ఎఐటియిసి, ఐఎఫ్టియు టిఎన్టియుసి , అన్ని సంఘాల నాయకత్వం కలిసి అంగన్వాడీల సమ్మె గురించి వారితో చర్చించారు. అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మెలోని సమస్యల్ని పరిష్కరించమని కోరారు. అంగన్వాడీల నాయకత్వాన్ని పిలిచి మాట్లాడమని , వారి న్యాయమైన కోర్కెలను పరిష్కరించమని కార్మిక సంఘాల ఐక్యవేదిక తరపున రాష్ట్ర నాయకత్వం కోరింది. అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టడం, కొన్ని జిల్లాల్లో అధికారులు అభ్యంతరకరంగా వ్యవహరించిన తీరు సరైనది కాదని తెలిపారు. దీనికి స్పందిస్తూ ..త్వరలోనే అంగన్వాడీ సంఘాల నాయకత్వాన్ని పిలిచి చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిడిఎఫ్ ఎమ్మెల్సీ కే ఎస్ లక్ష్మణ రావు,సి ఐటియు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్సులు నాగేశ్వరరావు, సి. హెచ్ నర్సింగరావు, ఉపాధ్యక్షులు ఉమమహేశ్వర రావు,దయ రమాదేవి, ఎఐటి యిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు, ఉప ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య, ఐఎఫ్టియుఅధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు ప్రసాద్,పొలారి, టిఎన్ టియిసి అధ్యక్షులు రఘు రామరాజు, తదితరులు పాల్గొన్నారు.