fbpx

సాధారణ చార్జీలతోనే ఆర్టీసీ ప్రత్యేక బస్సులు : ఎమ్.డి ద్వారక తిరుమలరావు

Share the content

హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు రెగ్యులర్ గా నడిచే సర్వీసులతో పాటు అదనపు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసి ఎండీ ద్వారకా తిరుమల రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల దృష్ట్యా మే 8 నుండి 12 తేదీ వరకు ఈ సదుపాయం కల్పించినట్లు పేర్కొన్నారు.అదే విధంగా ఓటు వేసి తిరిగి ప్రయాణమయ్యే వారి కోసం కూడా ఇబ్బందులు లేకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ మేరకు శనివారం ఆయా జిల్లాల ప్రజా రవాణా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సాధారణ ఛార్జీలతోనే ఈ ప్రత్యేక బస్సులు నడపబడతాయని తెలిపారు. హైదరాబాద్ నుండి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రోజూ నడిచే 339 సర్వీసులతో పాటు 11 వ తేదీన 302 మరియు 12 వ తేదీన 206 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ రోజు హైదరాబాద్ నుండి ఒంగోలుకి 38, ఏలూరుకు 20 బస్సులు, మచిలీపట్నం కు 23, విజయవాడకు 45, గుంటూరు 18, నరసరావు పేట 26, నెల్లూరు 17, నంద్యాల 19, విశాఖపట్నం 4 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.హైదరాబాద్ లో బి. హెచ్. ఈ. ఎల్. ఎంజిబిఎస్, ఈ. సి. ఐ. ఎల్., జీడిమెట్ల , రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు నుండి ప్రత్యేక బస్సులు మొదలు కానున్నాయి. బెంగుళూరు నుండి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 11 వ తేదీన మొత్తం 323 బస్సులు, 12 వ తేదీన 269 బస్సులు ఏర్పాటు చేశారు.అటు రాష్ట్రంలో ఓట్ల పండుగ కోసం పోటెత్తిన వారితో ఈ రోజు విజయవాడ బస్ స్టేషన్ రద్దీగా మారింది. విజయవాడ నుండి విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, కాకినాడ, ఏలూరు, ఒంగోలు, గుంటూరు తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడవనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *