రాష్ట్రంలోని ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే డిసెట్ ను ఈనెల 24న నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన తమ హాల్ టికెట్లు ఈ నెల 17 నుంచి https://cse.ap.gov.in/ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్న వెంటనే వివరాలను సరి చూసుకోవాలని తెలిపారు. అభ్యర్థి పేరు, తండ్రి పేరు, ఆధార్ నంబరు, మీడియం మొదలైన అంశాల్లో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే వెంటనే కింద తెలిపిన హెల్ప్ లైన్ నెంబర్ లకు (8125046997 మరియు 8121947387) ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు.అధికారులు తప్పులను సవరించి హాల్ టికెట్లను తిరిగి వెబ్సైట్లో ఉంచుతారు. వాటిని అభ్యర్థులు వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని ఈ నెల 24న జరిగే పరీక్షకు హాజరవ్వాలని తెలిపారు.