విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గత 700 రోజులుగా విశాఖపట్నంలో జరుగుతున్న దీక్షలకు సంఘీభావంగా ఉభయగోదావరి, కోనసీమ జిల్లాల కార్మిక సంఘాల నేతలు మద్దతు తెలిపారు .
ఎన్నో త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకుంటామని పేర్కొన్నారు. మోడీ అమిత్ షాలు దేశ సంపదను కార్పొరేట్ వ్యక్తులకు ఆదాని అంబానీలకు అప్పగించడాన్ని వారు విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకించారు. ఆంధ్ర రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను మోడీ ప్రభుత్వం విస్మరించిందని వారు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలు మానుకోకపోతే తగిన గుణపాఠం ఉద్యోగ కార్మిక సంఘాలు చెప్తాయని వారు హెచ్చరించారు.ఆంధ్రలో నివసించే ప్రతిఒక్కరు విశాక ఉక్కు ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు .