ప్రజల్లోకి బలంగా పోవాలంటే మాస్ నాయకుడు అనిపించుకోవాలి.. అలాగే కార్యకర్తలు సమీకరించుకోవాలి అన్న ఆ బ్రాండ్ ఖచ్చితం. ఎన్నికల్లో రెండు ఓట్లు పడాలన్న ఆ నాయకుడు స్పీచ్ వినాలన్న మాస్ జనం గుర్తింపు ఉండాలి. నిన్న మొన్నటి వరకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ బాబుకు పూర్తిస్థాయిలో మాస్ ఫాలోయింగ్ లేదు. ఆయన స్పీచ్ లు గాని ఆయన నడవడిక గాని ఎవరు పరిశీలించేది లేదు. పైగా ఆయనకు నిక్ నేమ్ పెట్టి ఏడిపించేవారు. అయితే ప్రస్తుతం లోకేష్ ప్రవర్తన తీరులో పూర్తి మార్పు కనిపిస్తోంది.యువగళం పాదయాత్ర ద్వారా జనంలోకి చొచ్చుకొని వెళుతున్న లోకేష్ తన ప్రవర్తన తీరును శైలిని కూడా మార్చుకుంటున్నారు. పార్టీ నాయకులతోనే కాదు బయట ప్రత్యర్థులతో అంతే బలంగా పోరాడగలరని సంకేతాలను పార్టీ క్యాడర్ ఇస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో ప్రస్తుతం యువ గళం పాదయాత్ర జరుగుతోంది. పాదయాత్రకు అనువనమున ఆటంకాలు ప్రభుత్వ పెద్దలు కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా వ్యవస్థలను ఉపయోగించుకుంటూ, లోకేష్ పాదయాత్ర ని అడ్డుకోవాలని అని చూస్తున్నప్పుడల్లా లోకేష్ అంతే వేగంగా ప్రతిస్పందించడం ఇప్పుడు టిడిపి కార్యకర్తలను నాయకులను కూడా ప్రభావితం చేస్తోంది.
నిన్న మొన్నటి వరకు కాదు అన్న వారే
లోకేష్ నాయకత్వాన్ని నిన్న మొన్నటి వరకు కాదు అన్న వారే ఇప్పుడు లోకేష్ కు జై కొడుతుండటం చూస్తే ఖచ్చితంగా లోకేష్ ప్రభావం పార్టీ శ్రేణులను కార్యకర్తల్లోనూ నింపింది అనడంలో సందేహం లేదు. ఒకవైపు ప్రజలతో మమేకమవుతూ అధికార పక్షం తీరును ఎండగడుతూ లోకేష్ బలంగా ముందుకు సాగుతున్నారు. మరోపక్క పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. టికెట్ల విషయంలో కచ్చితంగా నిక్కచ్చిగా ఉంటామని గెలిచే అభ్యర్థులకే ఈసారి టికెట్లు కేటా ఇస్తామని చంద్రబాబు అంత మంచి వాడిని తాను కాదని లోకేష్ బహిరంగంగా చెప్పడం ద్వారా పార్టీ నాయకులకు హెచ్చరిక సందేశాలు పంపినట్లు అవుతుంది. కోడెల శివరాం వ్యవహారంలో కానీ భూమా అఖిలప్రియ వ్యవహారంలో గాని లోకేష్ గట్టిగా వ్యవహరించారు. ఎట్టి పరిస్థితుల్లో బెదిరింపులకు ఈసారి లొంగేది లేదని గెలుపు అభ్యర్థులనే నిలబెట్టాలని లోకేష్ బలంగా భావిస్తున్నారు. దీనికి తగినట్లుగానే ఆయన వైఖరిలోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మరోపక్క అడ్డు వచ్చిన పోలీసులతోనూ ఆయన అదే తీరున గట్టిగా వివరిస్తుండడం అది మాస్ ఫాలోయింగ్ తెచ్చి పెట్టడం లోకేష్ కు ఇప్పుడు అదనపు బలంగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే దూకుడును యువగళం పాదయాత్రలో ఆయన ప్రదర్శిస్తే వచ్చే రోజుల్లో కచ్చితంగా లోకేష్ పాదయాత్ర తెలుగుదేశంకు మంచి మైలేజ్ తెచ్చే అవకాశం కనిపిస్తుంది.