fbpx

తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్

Share the content

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించరున్నారు అకాలవర్షాలతో పంట కోల్పోయిన రైతులను ఆయన పరామర్శించనున్నారు. దీనిలో భాగంగా బుధవారం ఉదయం పవన్ కళ్యాణ్ రాజమండ్రి కి చేరుకొని అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. అనంతరం కడియం రైతులతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నియోజకవర్గాల మీదగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించరున్నారు. ఆయనతో పాటు పి.ఎ.సి చీఫ్ నాదెండ్ల మనోహర్ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి లేఖ రూపంలో డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా మూడు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆయన ఆ లేఖల పేర్కొన్నారు. నష్టాన్ని అంచనా వేసి త్వరగా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జనసేన అధికారంలోకి రాగానే ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ఒక ప్రత్యేక పాలసీని అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. తూర్పుగోదావరి పర్యటనలో భాగంగా స్థానిక జనసేన నాయకులుపర్యటనకు సంబంధించి ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *