fbpx

చంద్రబాబు రథచక్రాలు విరిగిపోవడం ఖాయం : మేరుగు నాగార్జున

Share the content

రాష్ట్రంలో ప్రస్తుత ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడానికి సిద్ధంగా ఉందని సాంఘిక సంక్షేమ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. నా ఎస్సీ,నా ఎస్టీ,నా బిసి ,నా మైనార్టీ అని పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి పనితనంపై ప్రజల్లో గొప్ప భావన ఉందన్నారు. చంద్రబాబు,పవన్ కళ్యాణ్,కమ్యూనిస్టులు, కాంగ్రెస్ లు అందరు కలిసినప్పటకి…ప్రజలంతా జగన్ వెంటే ఉన్నారన్నారు బుధవారం వైసిపి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 4 న రాష్ట్రంలో సునామీ రాబోతుంది. చంద్రబాబు రథ చక్రాలు విరిగిపోవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గొప్ప విజయం నమోదు చేసుకోవటానికి ఆస్కారం కలుగుతుంది అని అన్నారు.పెరిగిన పాజిటివ్ ఓటింగ్ ప్రభుత్వానికి రావటానికి సిద్ధంగా ఉందన్నారు.

పేదలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసారన్నా భావనతో రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ, మైనార్టీల మిద జరుగుతున్న దాడులను ప్రజలంతా గమనిస్తూన్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారానికి అడ్డుకట్ట వేయాలన్న కుట్రతో ఒక పద్ధతి ప్రకారం దాడులు చేశారని ధ్వజమెత్తారు. కేంద్రంతో చంద్రబాబు లాలూచీ అయ్యి అధికారులను తనకు అనుకూలంగా మర్చుకున్నారని మండిపడ్డారు. అధికార యంత్రంగం చంద్రబాబుకు అడుగులు ముడుగులు ఒత్తారని ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను నిలవారించాలని ఆలోచన తప్పా..ఎన్నికల విధులు వారు ఎక్కడ సరిగా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద బలగాలు పెట్టమని తాము ఎన్ని విజ్ఞప్తులు చేసినా నిమ్మకు నీరెత్తినట్టుగా అధికారులు వ్యవహరించారని వాపోయారు. రాబోయే వైసిపి ప్రభుత్వంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల మిద విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *