కాకినాడ జేఎన్టీయూ విశ్వవిద్యాలయం పరిధిలో నేటి నుంచి 144 సెక్షన్ అమలలో ఉంటుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె.నివాస్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లాలోని కాకినాడ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలైన ఈవీఎం, వీవీప్యాట్స్ లను జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో వివిధ బ్లాకుల్లో సిద్ధం చేసిన స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచామన్నారు.. కేంద్ర, రాష్ట్ర పోలీస్ బలగాలతో మూడంచెల భద్రతను స్ట్రాంగ్ రూముల వద్ద ఏర్పాటు చేశామన్నారు. నేటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసేంతవరకు జేఎన్టీయూ విశ్వవిద్యాలయం చుట్టు ఒక కిలోమీటరు పరిధిలో 144 సెక్షన్ పటిష్టంగా అమలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.