రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరానికి
ప్రభుత్వ, ప్రైవేట్ ఐటిఐలలో వివిధ ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ ట్రేడ్ లలో ప్రవేశం కొరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ డా. బి. నవ్య తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.ఆసక్తి, అర్హతగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కొరకు పోర్టల్ iti.ap.gov.in లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కొరకు ఆఖరు తేదీ జూన్ 10వ తేదీగా నిర్దారించామన్నారు. ఆన్ లైన్ దరఖాస్తు పూర్తి చేసే క్రమంలో ఎటువంటి తప్పులు లేకుండా చూడాలన్నారు. ఇతర వివరాల కొరకు దగ్గరలోని ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపాల్ ను సంప్రదించాలని తెలిపారు.