fbpx

సిఎం జగన్ కు సిబిఐ కోర్టులో ఊరట….విదేశీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్

Share the content

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు సీబీఐ కోర్టులో భారీ ఊరట లభించింది. విదేశాలకు వెళ్లేందుకు సిఎం జగన్ కు మంగళవారం సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 17 నుండి జూన్‌ 1 వరకు యూకే వెళ్ళడానికి అనుమతి ఇచ్చింది. ఈ నెల 17న జగన్‌ లండన్‌ వెళ్లనున్నారు. లండన్‌, ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌లో పర్యటించేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని జగన్ నాంపల్లి సీబీఐ కోర్టులోదరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.జగన్‌ పర్యటనపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్రమాస్తుల కేసులో విచారణ జరుగుతోందని, అనుమతి ఇవ్వొద్దని సీబీఐ వాదించింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం నేడు జగన్‌ విదేశీ పర్యటనకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.గత రెండు ఎన్నికల అనంతరం సిఎం జగన్మోహన్ రెడ్డి తన కుటుంబంతో విదేశీ పర్యటనకు వెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *