fbpx

చంద్రబాబు చెబితేనే మీకోసం పాదయాత్ర చేసానా ? : షర్మిల

Share the content

తాను చంద్రబాబుతో చేతులు కలిపినట్లు..తనను ఆయన నియంత్రిస్తున్నట్లు ఒక్క ఆధారమైన చూపించాలని రాష్ర్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల సవాల్ విసిరారు.శనివారం కడప కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.తన కుమారుడు పెళ్లికి ఆహ్వానించడానికి మాత్రమే చంద్రబాబుని కలిశానని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితోనే తాను ఆహ్వానించానని పేర్కొన్నారు. అంతకుమించి తాను ఎప్పుడూ చంద్రబాబు ను కలవలేదని స్పష్టం చేశారు. తన తండ్రి హత్య కేసులో దోషులను శిక్షించాలని న్యాయ పోరాటం చేస్తున్న సునీత రెడ్డిని కూడా చంద్రబాబు చేతిలో ఉన్నారని వ్యాఖ్యానించడం సమంజసం కాదన్నారు. చంద్రబాబు చెబితేనే మీ కోసం 3200 కిలో మీటర్లు పాదయాత్ర చేసానా? గత ఎన్నికల్లో బై బై బాబు నినాదం కూడా ఆయన అనుమతితోనే చేసానా? సమైక్యాంధ్ర ఉద్యమం చేసానా? తెలంగాణలో ఓదార్పు యాత్ర చేసానా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు వ్యతిరేఖకంగా ఉన్న ప్రతి విషయాన్ని చంద్రబాబే చేయించారు అని అంటుంటే…జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు పిచ్చి పట్టినట్లు ఉందేమోనని ఎద్దేవా చేశారు.జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అనే భ్రమలో ఉన్నారని..ఆయన మానసిక స్థితి పై బయం వేస్తుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు లు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి…ప్రతేక హోదా పై పొరాడనందుకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు.

చంద్రబాబు పిచ్చి ఎందుకు పట్టుకుంది?

షర్మిల, సునీత, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీ లును కూడా చంద్రబాబే నియంత్రిస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి అద్దంలో మొహం చూసుకుంటే మీ మొహం కనిపిస్తుందా? చంద్రబాబు మొహం కనిపిస్తుందా అనేది పరిశీలన చేసుకోండి అని హితవు పలికారు. ఎందుకు చంద్రబాబు పిచ్చి ఇంత పట్టిందో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *